ఈరోజుల్లో మానవ సంబంధాలు ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు. అటు ప్రేమ వివాహం చేసుకున్న లేదా పెద్దల మాట విని పెళ్లి చేసుకున్న దంపతుల మధ్య రిలేషన్ సరిగాఉండడం లేదు ఇక పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత కూడా విడిపోతుంటారు.ఇవ్వని చూసిన కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేసి ఉద్యోగం చేస్తున్న వారికీ ఒక శుభవార్త తీసుకొచ్చింది ఏంటో చూడండి.

కేంద్ర ప్రభుత్వం:
కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే పురుష ఉద్యోగులకు శుభవార్త. భార్య లేకపోయినా, ఆమె నుంచి విడిపోయినా పిల్లల సంరక్షణ చూసుకు నేందుకు సర్వీసు మొత్తం మీద అదనంగా 730 రోజుల పాటు చైల్డ్ కేర్ లీవ్ (సీసీఎల్) తీసుకో వచ్చు. ఇప్పటివరకు ఈ వెసులుబాటు కేవలం మహిళా ఉద్యోగులకు మాత్రమే వర్తించేది.. ఇప్పుడు దాన్ని పురుషులకూ వర్తింపజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇద్దరు పిల్లల వరకు మహిళా ప్రభుత్వోద్యోగులు ఒక సంవత్సరంలో మూడు విడతలుగా సీసీఎల్ తీసుకోవచ్చు. ఇప్పుడు.. పెళ్లి కాని లేదా భార్య మరణించిన లేదా విడాకులు తీసుకున్న పురుష ప్రభుత్వోద్యోగులు కూడా ఇదే విధంగా సెలవు తీసుకోవచ్చు

730 రోజుల:
అయితే ఇలా సెలవు తీసుకునేందుకు అర్హతలు ఉండే పురుష ఉద్యోగుల సంఖ్య తక్కువగానే ఉండే అవకాశమున్నా.. పిల్లల సంరక్షణ చాలావరకు మహిళలే చూసుకుంటారన్న భావన నుంచి కాస్త దూరంగా వెళ్లేందుకు ఇది ఒక మేలి మలుపని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. అయితే, 730 రోజుల సెలవు కాలంలో సగం జీతాన్ని మాత్రమే ఇస్తారని సిబ్బంది వ్యవహారాల శాఖ తన ఉత్తర్వులలో పేర్కొంది

ఒక ఏడాదిలో:
ఇంతకుముందు నిబంధనల ప్రకారం అయితే సెలవు సమయంలో 365 రోజుల పాటు వంద శాతం జీతం, తర్వాతి 365 రోజుల పాటు 80% జీతం ఇవ్వాలని ఉండేది. సీసీఎల్తో పాటు మహిళలకు 180 రోజులు మాతృత్వ సెలవు, పురుషులకు 15 రోజుల పితృత్వ సెలవు ఉన్నాయి. 2017 మార్చిలో పార్లమెంటు ఆమోదించిన చట్టం ప్రకారం వ్యవస్థీకృత రంగంలోని మహిళలకు మాతృత్వసెలవును 26 వారాలకు పెంచారు. అలాగే సీసీఎల్ విషయంలో కూడా మహిళలకు మరో వెసులుబాటు కల్పించారు. ఒక ఏడాదిలో కేవలం 3 సార్లు మాత్రమే కాకుండా.. ఆరు సార్లు దీన్ని వాడుకోవచ్చని తెలిపారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications