డిసెంబర్ 31 ప్రజలపై భారం వేయనున్న మోడీ ప్రభుత్వం!
ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 వస్తుంది అంటే ప్రజలలో ఎంతో ఉత్సాహం చూపిస్తారు ఒక్క ఇండియాలోనే కాదు మొత్తం ప్రపంచంలో ఈ వేడుకలు జరుగుతాయి. ప్రతి సారి ఇండియాలో ఎంతో సంతోషంగా ఈ వేడుకలు జరుపుకునేవారు ఈ సారి మోడీ ప్రభుత్వం ఈ వేడుకలకి కొంచెం ప్రజల మీద భారం వేయనుంది. ఇంతకీ ఏంటో మిరే చూడండి.
డిసెంబర్ 31 సమీపిస్తోంది. 2018 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ... 2019కు స్వాగతం పలుకుతూ వివిధ సంస్థలు, వ్యక్తులు భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. సినీ హీరో, హీరోయిన్లను రప్పించి మరీ సెలబ్రేట్ చేస్తుంటారు. అయితే, ఈ సారి న్యూ ఇయర్ వేడుకలు నిర్వహిస్తే జీఎస్టీ చెల్లించాల్సిందే న్యూ ఇయర్ సందర్భంగా నిర్వహించే వినోదాత్మక కార్యక్రమాలకు ముందస్తుగా జీఎస్టీ చెల్లించాలని తెలంగాణ పన్నుల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు.
ఏముందిలే అని వేడుకలు నిర్వహిస్తే మాత్రం భారీ మొత్తంలో ఫైన్ వేయనున్నారు అంటే జీఎస్టీ వసూలు చేయడంతో పాటు నిర్వహకులపై 100 శాతం జరిమానా విధిస్తామని కమిషనర్ హెచ్చరించారు. వినోదాత్మక కార్యక్రమాలపై 28 శాతం జీఎస్టీ వసూలు చేయాలనే నిబంధన ఉండడంతో. ముందస్తుగానే జీఎస్టీ చెల్లించాలని సూచించారు. వేడుకలకు అయ్యే ఖర్చును బట్టి దానిపై 28 శాతం ముందుగానే వాణిజ్య పన్నుల శాఖకు చెందిన సర్కిల్ కార్యాలయాల్లో చెల్లించాలని ఆదేశించారు.