జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును కేటాయించడంతో జనసేన పార్టీ వర్గాల్లో నూతనోత్సాహం కనిపిస్తుంది. తమ పార్టీకి ఎన్నికల గుర్తు రావడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో తన ఆనందాన్ని వ్యక్తం చేసి, జనసైనికులు అందరూ తమ పార్టీ గుర్తును బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలువు ఇవ్వడంతో కార్యకర్తలు అందరూ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగారు.

సోషల్ మీడియాను:
పార్టీ అభిమానులు, జనసేన కార్యకర్తలు అందరూ సోషల్ మీడియాను వేదికగా చేసుకుని గాజు గ్లాసులో టీ తాగే ఫోటోలు పోస్టు చేస్తూ ఒకవైపు ప్రచారం చేస్తున్నారు. ఇదిలాఉంటే పోటీ చేసే అభ్యర్ధులు పార్టీ ఎన్నికల గుర్తు అయిన గ్లాసులను పెద్దఎత్తున కొనుగోలు చేసి ప్రచారం చేస్తున్నారు.

గాజు గ్లాసు ధర:
సాధారణంగా గాజు గ్లాసు ధర 10 నుంచి 15 రూపాయల ధర ఉంటే ఇప్పుడు ఆ గ్లాసు ధర 50 రూపాయలు నుంచి 60 రూపాయలు వరకూ పలుకుతోంది. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా గాజు గ్లాసుల వినియోగం బాగా తగ్గిపోవడం మార్కెట్లో గ్లాసులు అందుబాటులో లేకపోవడంతో డిమాండ్ ఆసరాగా చేసుకుని రేటు పెంచేశారు మార్కెట్దారులు. డిస్పోజ్బుల్ గ్లాసులు విరివిగా వాడుతున్న నేటి రోజుల్లో జనసేన పార్టీ మూలంగా గాజు గ్లాసులకు భలే గిరాకీ వచ్చినట్టుంది.

ప్రజలందరికి ఉచిత గ్యాస్ సిలిండర్: పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనను ఒక కులానికో, కుటుంబానికో పరిమితం చేయడం సరికాదని, ఇకపై తన ఇంటిపేరు కొణిదెల కాదని, తెలుగు అని అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, తాను తెలుగుజాతికి సంబంధించిన వ్యక్తినని చెప్పారు.

టంగుటూరి:
టంగుటూరి ప్రకాశం పౌరుషం, పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం నేటి పాలకుల్లో కనిపించడం లేదని అన్నారు. అడ్డదారిలో సీఎం అయిన చంద్రబాబులా తాను మాటలు మార్చబోనని చెప్పారు. కృష్ణా గోదావరి బేసిన్ లో అపారమైన చమురు నిల్వలు ఉన్నందునే తాను ప్రజలకు ఉచితంగా వంట గ్యాస్ ను సరఫరా చేస్తానని చెప్పానని అన్నారు.

దివ్యాంగులు పింఛన్:
తన ప్రభుత్వం వస్తే, దివ్యాంగులు పింఛన్ కోసం బయటకు రావాల్సిన అవసరం లేదని, అధికారులే ఇంటికి వెళ్లి పెన్షన్ అందిస్తారని చెప్పారు. ప్రజలు తమ ఓటును అమ్ముకోకుండా, బాధ్యతతో నేతలను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.

జనసేన:
పవన్ కళ్యాణ్ జనసేన రాజకీయ పార్టీ పెట్టి ప్రజాక్షేత్రంలోకి వచ్చాడు. అయితే 2019 ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు రెడీ చేసుకుంటున్నాయి. అయితే ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది.

ఒక్కొక్కరికి రూ.10 వేలు:
ఇక జనసేన అధినేత ప్రజలకు అందిస్తున్న మేనిఫెస్టో చూద్దామా. తాజాగా దివ్యంగులకి ఒక్కొక్కరికి రూ.10 వేల రూపాయిలు పిన్షన్ ఇస్తాము అని ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఏలూరు లో దివ్యంగా సంఘాల ప్రతినిధులతో కలిసిన పవన్ కళ్యాణ్ తను చిన్నప్పటి నుంచి దివ్యంగులని చూస్తే చేలించి పోయేవాడిని అని అందుకే 20 ఏళ్ల వయస్సులో వారి కష్టాలపై ఒక డాక్యూమెంటరీ తీసాను అని చెప్పారు.

సామజిక పెన్షన్:
ఇంతటితో ఆగకుండా రేజర్వేషన్లు, ప్రత్యేక కార్పోరేషన్, హాస్టలు, ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు, మరియు హెల్త్ కార్డులు ఇలా ప్రజల పై వరాల జల్లు కురిపించాడు. ఇక ఆ తర్వాత పెన్షన్ గురించి చెప్పారు సామజిక పెన్షన్ రూ.5 వేలకి పెంచాలి అని దివ్యంగులు కోరగా జనసేన అధికారంలోకి వస్తే రూ.10 ఇస్తాము అని పవన్ కళ్యాణ్ చెప్పారు.

తమ డిమాండ్లు:
హామీల విషయంలో పవన్ కళ్యాణ్ ఏ వర్గాన్ని వదిలిపెట్టడం లేదు తమ డిమాండ్లు విలపించాడు వెళ్లిన వారు కూడా ఆశ్చర్యపోయేలా అయన హామీలు ఉంటున్నాయి అని సమాచారం. ఇక రేషన్ బదులు నేరుగా అకౌంట్ లోకి డబ్బులు వచ్చేలాగా చేస్తాం అని అంటున్నారు.

మ్యానిఫెస్టో:
మ్యానిఫెస్టో తయారీ ముందు వరకు అన్ని చూసుకొని హామీలు ఇస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కనివిని ఎరుగని రీతిలో సాధ్యపడుతుందా లేదా అని ఆలోచించకుండా హామీలు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్.

యువత మొత్తం:
మొత్తం 2019 ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కనుక ప్రతి రాజకీయ పార్టీ ప్రజలను ఆకర్షించేకి ఎన్నో రకాల పధకాలు మరియు వరాలతో వస్తారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో యువత మొత్తం పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు చూడాలి 2019 ఎన్నికలకి ఏమి జరుగుతుందో.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications