ఏపీ రాజధాని అమరావతిలో ఈరోజు ఉదయం సచివాలయం ఐదు టవర్లకు ర్యాప్ట్ ఫౌండేషన్ పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇవాళ రెండు కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. ఒకటి సచివాలయం కోసం ర్యాప్ట్ ఫౌండేషన్, రెండోది రాయలసీమలో ఉక్కు కర్మాగారానికి శంఖుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు. అమరావతిలో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టామని.. ఇది జీవితంలో మరచిపోలేని సంఘటన అని అన్నారు. అత్యంత సాంకేతికత పరిజ్ఞానంతో సచివాలయ టవర్ల నిర్మాణం జరుగుతుందని.. ప్రపంచానికే తలమానికంగా సచివాలయ టవర్లు నిర్మిస్తామని తెలిపారు. దేశంలోనే తొలిసారి ర్యాప్ట్ ఫౌండేషన్ విధానం తీసుకొచ్చామన్నారు. 36 నెలల్లో టవర్ల నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు.

తెలుగువారి ఆత్మగౌరవానికి చిహ్నంగా రాజధాని నిర్మాణం జరుగుతుందని, బౌద్దస్తూపం ఆకారంలో ఐకానిక్ భవనం నిర్మిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. సచివాలయ ప్రాంగణంలో 4వేల కార్లు పార్క్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఒకేసారి 10వేల మంది విజిటర్స్కు ఆతిథ్యం లభిస్తుందని, 1375 ఎకరాలలో పరిపాలన భవనాలు ఉంటాయని తెలిపారు. అదేవిధంగా హైకోర్టు విభజనను స్వాగతిస్తున్నామని చంద్రబాబు అన్నారు. జనవరి1 నుంచి విజయవాడ సీఎం క్యాంప్ ఆఫీసులో తాత్కాలికంగా హైకోర్టు కార్యకలాపాలు కొనసాగుతాయని స్పష్టం చేసారు. అమరావతిలో శాశ్వత భవనం నిర్మించిన తర్వాత.. ప్రస్తుత తాత్కాలిక హైకోర్టును జిల్లా కోర్టుగా మారుస్తామన్నారు.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications