For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నష్టాలలో ఈరోజు దేశీయ మార్కెట్

By girish
|

గత ట్రేడింగ్‌లో భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు మంగళవారం (డిసెంబరు 18) నాటి ట్రేడింగ్‌ను నష్టాలతో ప్రారంభించాయి. కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. దీంతో సెన్సెక్స్‌ 150 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడింగ్‌ను ఆరంభించగా.. నిఫ్టీ 50 పాయింట్లు కోల్పోయింది. ట్రేడింగ్‌లో బ్యాంకింగ్‌, ఐటీ, ఆటోమొబైల్‌, వినియోగ రంగాల షేర్లు అమ్మకాలతో కుదేలవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితి అలాగే ఉంది. మరోవైపు వృద్ధి రేటు మంద‌గిస్తున్న అంచ‌నాల‌తో ముడి చ‌మురుకు డిమాండ్ ప‌డిపోతోంది. ఈ నేప‌థ్యంలో క్రూడ్ ధ‌ర‌లు భారీగా పెరిగాయి.

ఉదయం 11.10 గంటల సమయానికి సెన్సెక్స్‌ 183.75 పాయింట్ల నష్టంతో 36,086 వద్ద, నిఫ్టీ 59 పాయింట్లు నష్టపోయి 10,829 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 27 పైసలు బలపడి 71.28 వద్ద కొనసాగుతోంది.

 నష్టాలలో ఈరోజు దేశీయ మార్కెట్

నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో టాప్ గెయిన‌ర్‌గా టాటా మోటార్స్ నిలిచింది. నిన్న నాలుగుశాతంపైగా లాభ‌ప‌డిన ఈ షేర్ ఇవాళ కూడా 1.5శాతం లాభంతో ట్రేడ‌వుతోంది. హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, జేఎస్‌డ‌బ్ల్యూ స్టీల్‌, బ‌జాజ్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీస్ త‌ర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక నిఫ్టి షేర్ల‌లో జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్, ఇన్ఫోసిస్‌, విప్రో, ఐష‌ర్‌మోటార్స్‌, టెక్ మ‌హీంద్రా సంస్థల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Read more about: stock market
English summary

నష్టాలలో ఈరోజు దేశీయ మార్కెట్ | Stock Market Today

n the last trading session, the markets ended with losses on Tuesday (December 18). Indexes are under pressure when sales are key in key sectors
Story first published: Friday, December 21, 2018, 17:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X