శుక్రవారం నాడు డాలర్ తో పోల్చిచూస్తే రూపాయి మారకం విలువ బలహీనపడింది. గ్లోబల్ ఆర్థికాభివృద్ధిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొనడం ప్రతికూల ప్రభావం
ముంబయి: శుక్రవారం నాడు డాలర్ తో పోల్చిచూస్తే రూపాయి మారకం విలువ బలహీనపడింది. గ్లోబల్ ఆర్థికాభివృద్ధిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొనడం ప్రతికూల ప్రభావం చూపింది.

ఉదయం 9.15 సమయంలో 70.05 వద్ద ట్రేడవుతోంది.గురువారం నటి ముగింపు 69.70 తో పోల్చిచూస్తే 0.49 శాతం పడిపోయింది. రూపాయి 69.94 వద్ద ప్రారంభమై, వరుసగా 69.70 గరిష్ట స్థాయిని, 70.06 కనిష్ట స్థాయిని తాకింది.
ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగం తర్వాత గ్లోబల్ మార్కెట్లు క్షీణించాయి. అమెరికా ప్రభుత్వం పాక్షికంగా మూతపడనుందనే ఆందోళనల వల్ల ట్రేడర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరిన్నారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాలసీ విధానాలపై భిన్నాభిప్రాయాల కారణంగా రక్షణ శాఖ కార్యదర్శి జిమ్ మాటిస్ గురువారం తన రాజీనామాను ప్రకటించారు.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్కు $ 54.35 వద్ద $ 5 బిలియన్ లేదా 2.89 శాతానికి పడిపోయాయి - 2017 సెప్టెంబర్ 12 నుంచి చూస్తే ఇదే కనిష్ట స్థాయి. ఇప్పటివరకు ముడి చమురు 17% పడిపోయింది. ప్రస్తుతం అక్టోబర్ 3 న చూసిన బ్యారెల్కు $ 86.29 యొక్క 2018 గరిష్ట స్థాయి నుండి 36 శాతం పడిపోయారు
భారత్లో పదేళ్ల బాండ్ ఈల్డ్ 7.27 శాతం వద్ద ట్రేడవుతోంది. బాండ్ ఈల్డ్ మునపటి ముగింపు (గురువారం) 7.275 శాతంగా ఉంది. బాండ్ ఈల్డ్, ధరలు పరస్పరం వ్యతిరేక దిశల్లో ఉంటాయి.
సెన్సెక్స్ సూచి 0.05 శాతం పెరిగి 36450.73 పాయింట్ల వద్ద ముగిసింది.
ఈ ఏడాది ఇప్పటివరకు రూపాయి విలువ 8.76 శాతం తగ్గింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ నుంచి 4.37 బిలియన్ డాలర్లను, డెట్ మార్కెట్ నుంచి 7.12 బిలియన్ డాలర్లను వెనక్కు తీసుకెళ్లారు.


Click it and Unblock the Notifications