స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా చాలామంది వినియోగదారులు ఉన్న ప్రభుత్వ బ్యాంకు ఇక రోజురోజుకి ఒక నిబంధనలు వినియోగదారులకి షాక్ ఇస్తోంది. స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ఇస్తున్న ఈ షాకులకి సామాన్యులకి నడ్డివిరుగుతోంది.

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా:
స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ఎటిఎంల నుంచి నగదు లావాదేవీలు నిర్వహించే ఖాతాదారులకు కష్టాలు ఎదురు కానున్నాయి. ఈ మేరకు భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఆంక్షలు విధించింది. అక్టోబర్ 31 నుంచి నగదు లావాదేవీల మొత్తంపై పరిమితులు విధించిన ఎస్బీఐ.. తాజాగా ఏటీఎంల నుంచి నిర్దేశిత సంఖ్యకు మించి నగదు తీస్తే అదనంగా వడ్డింపులు ఉంటాయని స్పష్టంచేసింది.

ఖాతాదారులకు:
అయితే వేతన ఖాతాదారులకు మాత్రం అపరిమిత సంఖ్యలో ఏటీఎంల ద్వారా లావాదేవీలు చేసుకునే వెసులుబాటు కల్పించింది.దేశ బ్యాంకింగ్ రంగంలో అతి పెద్దదైన ప్రభుత్వరంగ సంస్థ ఎస్బీఐ ఏటీఎంల నుంచి ఉపసంహరించుకునే నగదు మొత్తాలపై ఇప్పటికే పరిమితి విధించింది.

ఏటీఎంల ద్వారా:
త్వరలో ఏటీఎంల ద్వారా నిర్వహించే లావాదేవీల సంఖ్యపై కూడా ఆంక్షలు అమలుల్లోకి తీసుకురానున్నది. ఈ ఏడాది అక్టోబర్ 31న కొత్తగా అమలులోకి తెచ్చిన నిబంధనల ప్రకారం ఐటీఎస్ క్లాసిక్, ఏటీఎం మిస్టో డెబిట్ కార్డుల ద్వారా ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ మొత్తం రోజుకు రూ.20వేలకు కుదించింది.

ఎస్బీఐ కస్టమర్లు:
ఇక కొత్తగా ఏటీఎంల ద్వారా నిర్వహించే లావాదేవీల సంఖ్యపై కూడా ఆంక్షలు విధించింది. అవి త్వరలో అమల్లోకి రానున్నాయి. ప్రధానంగా ఎస్బీఐ కస్టమర్లు మెట్రో నగరాల్లో నెలలో ఎస్బీఐ గ్రూపు బ్యాంకుల ఏటీఎంల నుంచి ఐదు సార్లు, మూడు సార్లు ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు లావాదేవీలు కొనసాగించవచ్చని స్పష్టంచేసింది.

పొదుపు ఖాతాల్లో:
ఇతర ప్రాంతాల్లో ఐదు సార్లు ఎస్బీఐ ఏటీఎంల నుంచి, ఐదు సార్లు ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు తీసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. సగటున రూ.25 వేల తమ పొదుపు ఖాతాల్లో ఉండేలా చూసుకునే ఖాతాదారులకు ఎలాంటి రుసుములు లేకుండా ఎస్బీఐ గ్రూపు బ్యాంకులలో ఏటీఎంలలో అపరిమిత సంఖ్యలో లావాదేవీలు నిర్వహించుకునే అవకాశం ఎస్బీఐ కల్పించింది.

లావాదేవీలు:
ఇతర ప్రాంతాల్లో ఐదు సార్లు ఎస్బీఐ ఏటీఎంల నుంచి, ఐదు సార్లు ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు తీసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. సగటున రూ.25 వేల తమ పొదుపు ఖాతాల్లో ఉండేలా చూసుకునే ఖాతాదారులకు ఎలాంటి రుసుములు లేకుండా ఎస్బీఐ గ్రూపు బ్యాంకులలో ఏటీఎంలలో అపరిమిత సంఖ్యలో లావాదేవీలు నిర్వహించుకునే అవకాశం ఎస్బీఐ కల్పించింది.

జీఎస్టీ:
అదేవిధంగా సగటున రూ.లక్షను తమ పొదుపు ఖాతాల్లో ఉంచేవారికి ఎలాంటి రుసుము లేకుండా అన్ని రకాల బ్యాంకుల్లో అపరిమిత సంఖ్యలో ఏటీఎం లావాదేవీలు నిర్వహించుకోవచ్చని స్పష్టంచేసింది. పరిమితికి లోబడి ఏటీఎంల లావాదేవీలు నిర్వహించాల్సిన ఖాతాదారులు అదనంగా నిర్వహించినట్లయితే ఒక్కో లావాదేవీపై రూ.5 నుంచి రూ.20 వరకు ఛార్జీలు వేస్తారు. ఈ మొత్తానికి జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

వెబ్సైట్లో:
ఆర్థిక లావాదేవీలు కాకుండా ఇతర లావాదేవీలు ఏవైనా ఉచిత లావాదేవీల పరిమితికి మించితే రూ.5, ఆ మొత్తానికి అదనంగా జీఎస్టీ ఉంటుంది. వేతన ఖాతాలు కలిగిన ఖాతాదారులు తమ గ్రూపు బ్యాంకుల ఏటీఎంలో, ఇతర బ్యాంకు ఏటీఎంలలో ఉచితంగా అపరిమిత ఏటీఎం లావాదేవీల నిర్వహణకు వెసులుబాటు కల్పించినట్లు ఎస్బీఐ తన వెబ్సైట్లో పేర్కొంది.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications