రెండవ రోజు పెరిగిన పెట్రోల్ ధరలు.పెరిగిన ధరలు పరిశీలించండి.
పెట్రోలు, డీజిల్ ధరలు మంగళవారం మరోసారి పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు 9-10 పైసలు పెరిగింది మరియు డీజిల్ దేశంలోని ప్రధాన నగరాల్లో లీటరుకు 7-8 పైసలు పెరిగిపోయింది.
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు మంగళవారం మరోసారి పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు 9-10 పైసలు పెరిగింది మరియు డీజిల్ దేశంలోని ప్రధాన నగరాల్లో లీటరుకు 7-8 పైసలు పెరిగిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు రూ.70.63 రూపాయల మేర ధర ఉంది. సోమవారం ధర రూ.70.53 రూపాయల నుండి 10 పైసలు పెరిగింది. ఢిల్లీలో డీజిల్ ధర రూ. 64.54 వద్ద ఉంది, సోమవారం ధర 64.47 రూపాయలు ఉండగా 7 పైసలు పెరిగింది.
ముంబైలో సోమవారం తో పోల్చుకుంటే పెట్రోలు 10 పైసలు పెరిగి 76.25 రూపాయలకు చేరుకుంది అదేవిదంగా డీజిల్ పై 8 పైసలు పెరిగి 67.55 రూపాయలకు చేరుకుంది. ఆదివారం నాటి ధర రూ .64.47 రూపాయలు.
చెన్నై, కోల్కతా రెండు మెట్రో నగరాల్లో పెట్రోల్ ధర 73.29 రూపాయలు, 72.71 రూపాయలు ధర ఉండగా మరియు డీజిల్ ధర రూ. 68.14, రూ.66.30 రూపాయల ధర ఉంది.
నోయిడాలో పెట్రోలు రూ.70.45 రూపాయలు, సోమవారం 70.37 రూపాయలు, డీజిల్ రూ.63.82 రూపాయల నుండి పెరిగి రూ.63.88 రూపాయలకు చేరుకున్నాయి.
భారతదేశంలో రిటైల్ ఇంధన ధరలు అంతర్జాతీయ చమురు ధర మరియు రూపాయి-డాలర్ మారకం రేటు రెండింటిపై ఆధారపడివుంటుంది. గత రెండు రోజులుగా ఇంధన ధరలు పెరిగిపోయినప్పటికీ, ముడి చమురు మళ్లీ తగ్గిపోయి, రూపాయి విలువ డాలర్కు వ్యతిరేకంగా పెరిగిపోయింది. మంగళవారం బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ఆసియన్ ట్రేడింగ్లో బ్యారెల్ మార్కు $ 59 దిగువ వర్తకం చేశాయి.
దేశంలో ప్రధాన నగరాల్లో పెట్రోలు ధరలు అక్టోబరు నెలలో చేరిన రికార్డు స్థాయి నుంచి దాదాపు 15-20 శాతం తగ్గాయి. ఈ ఇంధన ధరల తగ్గుదల ముడి చమురు ధరలు పడిపోవడం. చమురు ధర అక్టోబరు ప్రారంభంలో 30 శాతం పడిపోయి, బ్యారెల్ మార్కు 86 డాలర్లు దాటింది.