ఎన్నికలు గెలిచి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో ఉన్నాడు ప్రస్తుత ముఖ్యమంత్రి కెసిఆర్ . ఆసరా పింఛన్ వయస్సును 57 ఏళ్లకు కుదించడం, పెన్షన్ను రూ.2016కు పెంచడం, వికలాంగుల పెన్షన్ను రూ.3016కు పెంచడం, రైతు బంధు పథకం సాయం రూ.10 వేలకు పెంచడం.ఇలా ఎన్నికల ముందు తెరాస పార్టీ ఇచ్చిన హామీలలో కొన్ని.

సాగునీటి ప్రాజెక్టులు:
సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయడం, చెరువులు పూడికతీసి, వాటిని నింపడం, కొన్ని లక్షల ఎకరాలకు నీళ్లు పారడం, వంటివి సానుకూల అంశాలు తెరాస పార్టీకి కలిసొచ్చాయి.

రైతులకు:
సాగువిస్తీర్ణం పెరగడం, దిగుబడులు పెరగడం, సేద్యం పండుగలా మారడం, రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు భీమా వంటి పథకాలతో రైతు పక్షపాతిగా సిఎం కెసిఆర్ మారాయి. పెన్షన్లు, కెసిఆర్ కిట్, గొర్రెల పంపిణీ, చేపపిల్లల ఉచిత పంపిణీ, వంటి అంశాలు గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక, ఆర్ధిక స్వరూపాన్నే మార్చేశాయి.

కళ్యాణలక్ష్మి:
కళ్యాణలక్ష్మి, షాదీముబాకర్, రేషన్ బియ్యం, కంటి వెలుగు, విదేశీ విద్య పథకం, డబుల్ బెడ్రూం ఇళ్లు, జర్నలిస్టులు, ఆటోడ్రైవర్లు, హోంగార్డులకు ప్రమాద భీమా.. ఇలా చెబుతూ పోతే పెద్ద జాబితా అవుతుంది. పేదలకు భరోసా నింపే ఈ పథకాలే టిఆర్ఎస్కు శ్రీరామరక్షగా నిలిచాయి.

వృద్దాప్య పెన్షన్:
తెలంగాణలో57 ఏళ్లు నిండినవారికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు వినిపించారు. శాసనసభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం 57 ఏళ్లు నిండిన వారికి వృద్దాప్య పెన్షన్ అందించనున్నట్లు కేసీఆర్ మరోసారి పునరుద్ఘాటించారు.

ఆదేశాలు:
అందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించడంతోపాటు, అర్హులైన వారిని ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే. జోషిని ఆదేశించారు. వృద్ధాప్య పెన్షన్కి అర్హులైన అభ్యర్థుల సంఖ్య నిగ్గుతేలిన అనంతరం 2019-20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఈ పథకం కోసం అవసరమైన మొత్తంలో నిధులు కేటాయించి, ఏప్రిల్ నెల నుంచే లబ్ధిదారులకు పెన్షన్లు అందివ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

ప్రగతి భవన్లో:
పంచాయతీరాజ్ అంశాలతోపాటు, ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలపై నేడు ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించే క్రమంలో కేసీఆర్ ఈ ఆదేశాలు జారీచేశారని తెలుస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications