మీ ఏటీఎంలకి ఇంక 10 రోజులు మాత్రమే ఉంది జాగ్రత్త!
ప్రస్తుతం అధిక సంఖ్యలో ప్రజలు ఎటిఎం కార్డులు వాడుతున్నారు,ఒకప్పుడు డబ్బు కావాలంటే గంటల తరబడి బ్యాంకు లో నిలబడాలి కానీ ఎటిఎం లు వచ్చాక ప్రతొక్కరూ డబ్బును అతిసులువుగా బ్యాంక్ తో సంబంధం లేకుండా ఎటిఎం కేంద్రాల్లో డబ్బు పొందుతున్నారు,ఐతే త్వరలో మనం వాడుతున్న ఎటిఎం కార్డుల్లో కొన్ని రద్దు కాబోతున్నాయంట అవేంటో చూడండి..
ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఇది బ్యాంకు కు సంబంధించినది మరియు పీఎం మోడీ ప్రభుత్వానికి కి సంబందించినది,మనలో చాల మంది ఎటిఎం వాడేవాళ్లు అధిక సంఖ్యలో ఉన్నారు,మనం వాడుతున్న ఎటిఎం కార్డుల్లో కొన్ని కార్డులను రద్దు చేయబోతున్నారు.
ఈ బ్యాంకు కు సంబందించిన వార్త మనకు కొద్దీ రోజుల ముందు జీ న్యూస్ లో వచ్చింది మరియు ఆర్బిఐ వెబ్సైటు లో కూడా వచ్చింది కనుక ఇది వాస్తవం అని చెప్పవచ్చు,మీకు స్బిఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్ మరియు ఏ ఇతర బ్యాంకుల కార్డులు వాడుతున్న సరే మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం.
తరచూ మనం వాడే ఎటిఎం కార్డుల్లో రెండు రకాల కార్డులు ఉంటాయి,ఇందులో కొత్తగా వచ్చిన కార్డు మీద ఒక చిప్ ఉంటుంది ఇది అచ్చం మన ఫోన్ లో సిం ఎలా ఉంటుందో అలానే ప్రింట్ చేసి ఉంటుంది.
అదేవిదంగా పథ ఎటిఎం కార్డు వెనక నల్ల రంగులో ఒక పెద్ద గీత ఉంటుంది దానిని ఐయస్కాంత స్ట్రీప్ అని పిలుస్తారు,ఆర్బిఐ వీటిని రద్దు చేస్తోంది ఈ సంవత్సరం 2018 డిసెంబర్ 31 తరువాత మనకు ఈ మాగ్నెటిక్ స్ట్రీప్ కార్డులు కనపడవు.
డిసెంబర్ 31 తరువాత ఈ రద్దు చేయబడిన కార్డులు పనిచేయవు,ఎందుకిలా చేసారంటే మన ప్రభుత్వం భద్రత రీత్యా ఈ నిర్ణయం తీసికుంది.ప్రస్తుతం ఎవరైతే ఈ పాత కార్డులు వాడుతున్నారో వారి బ్యాంకులను సంప్రదించి కొత్త కార్డులు పొందొచ్చు,దీనికి ఈ ఏడాది డిసెంబర్ 31 దాకా సమయం ఉంది.