రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ అప్పుల తో బయటకు వచ్చింది కనీసం రాజధాని కూడా లేదు,గత కొన్ని దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది దేశ విదేశాలనుండి ఎన్నో పరిశ్రమలు ఐటి కంపెనీలు హైదరాబాద్ కి క్యూ కట్టాయి తద్వారా కొన్ని లక్షల మందికి ఉపాధి దొరికింది.ఇక రాష్ట్రం విడిపోయాక మొత్తం కంపెనీలు అన్ని హైదరాబాద్ లో ఉండిపోయాయి

కియా:
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ పరిశ్రమ దేశంలో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమలో ఏర్పాటు చేసింది.అనంతపురం జిల్లాలోని పెనుగొండ మండలం యర్రంచీ గ్రామంలో కంపెనీ తన అతిపెద్ద ఉత్పాదన కర్మాగారాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. కియా ఇప్పటికే దాని తయారీ కేంద్రంలో $ 1.1 బిలియన్లు
పెట్టుబడి పెట్టింది, మరియు ఇది తుది దశలో ఉంది.

ఆసియా పల్ప్ పేపర్ గ్రూప్ :
ఇండోనేషియాకు చెందిన అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజం ఆసియా పల్ప్ పేపర్ గ్రూప్ అనుబంధ సంస్థ సీనార్మాస్ గ్రూప్ రాష్ట్రం లోని ప్రకాశం జిల్లాలో పరిశ్రమను స్థాపించనుంది.ఈ సంస్థ రెండు దశల్లో రూ.21,600 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.

నోవాటెల్ గ్రూప్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి ఫైవ్ స్టార్ హోటల్ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమయింది. ప్రఖ్యాత నోవాటెల్ గ్రూప్ విజయవాడలో నిర్మించిన హోటల్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. నోవాటెల్ గ్రూపు దాదాపు రూ.150 కోట్ల వ్యయంతో ఈ హోటల్ ను నిర్మించింది. ఈ హోటల్ ను పర్యావరణ హితంగా, తక్కువ కాలుష్యం వెదజల్లేలా ఏర్పాట్లు చేశారు.

అమరావతిలోని:
ఈ విషయమై నోవాటెల్ ప్రతినిధులు మాట్లాడుతూ..అమరావతిలోని ఉద్ధండరాయుని పాలెం వద్ద రూ.40 కోట్ల వ్యయంతో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో కన్వెన్షన్ సెంటర్ ను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. విజయవాడలో నోవాటెల్ మరో సరికొత్త ఆకర్షణగా నిలుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications