స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధరలు.పలు నగరాల్లో ధరలు పరిశీలించండి.
శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి.
శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో లీటరుకు 39-45 పైసల ఇంధనం ధరలు తగ్గాయి. ఇటీవల ధరల సమీక్ష తరువాత, జాతీయ రాజధాని ఢిల్లీ లో పెట్రోలు రూ .70.92 వద్ద విక్రయించగా, గురువారం ఇది రూ .71.32 తో పోలిస్తే, లీటరుకు 40 పైసలు పడిపోయింది. ఢిల్లీలో డీజిల్ 41 పైసలు పతనమైన రూ.65.55 రూపాయల వద్ద నమోదయినది.
పెట్రోల్ నేడు రూ. 76.50 వద్ద విక్రయించగా ఇది గురువారం రూ. 76.90 వద్ద ఉంది మరియు డీజిల్ పై 43 పైసలు తగ్గి రూ.68.59 రూపాయల వద్ద ఉంది.
చెన్నై, కోల్కతా వంటి ఇతర మెట్రో నగరాల్లో పెట్రోల్ ధర రూ.73.57 రూపాయలు, రూ.72.97 రూపాయల ధర ఉంది.
నోయిడాలో పెట్రోలు 21 పైసలు, డీజిల్ ధర 25 పైసలు తగ్గి, రూ.70.82 రూపాయలు, రూ.64.89 రూపాయల చార్జీలు చోటుచేసుకున్నాయి.
అంతర్జాతీయ ముడి చమురు ధరలు శుక్రవారం పడిపోయాయి. అవుట్పుట్ కోతలపై తుది నిర్ణయం వాయిదా వేస్తూ OPEC నిర్ణయం తీసుకున్నది,అంతర్జాతీయ బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ బ్యారెల్కు 60 డాలర్ల దిగువకు పడిపోయి,33 సెంట్లు తగ్గి ఉదయం 9.15 గంటలకు బ్యారెల్కు 59.73 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యింది. ఇంతలో, US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ముడి ఫ్యూచర్స్ బ్యారెల్కు 51.24 డాలర్లు, 25 సెంట్లు లేదా 0.5 శాతం తగ్గాయి.
చమురు ధర అక్టోబరు ప్రారంభంలో 30 శాతం వరకు పడిపోయింది. బ్యారెల్ ధర 86 డాలర్లు.