పలు నగరాల్లో పెట్రోల్ ధరలు ఈవిదంగా ఉన్నాయి:ధరలు పరిశీలించండి
పెట్రోలు, డీజిల్ ధరలు గత 13 రోజుల నుండి తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, రూపాయి విలువ కూడా డాలర్కు పడిపోయింది.
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు గత 13 రోజుల నుండి తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, రూపాయి విలువ కూడా డాలర్కు పడిపోయింది.ఇది అక్టోబర్ ప్రారంభంలో ధరలు గరిష్ట స్థాయిలను తాకిన తరువాత, ఈ సంవత్సరం ఇంధనాల ధరలు అతి తక్కువ స్థాయికి పడిపోయాయని గమనించవచ్చు. అక్టోబర్ నెలలో పెట్రోలు ధరలు లీటరుకు రూ .12 చొప్పున తగ్గుముఖం పట్టాయి అదేవిదంగా డీజిల్ కూడా చౌకగా ధరలు నమోదయినవి.
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్సైట్లో లభించిన సమాచారం ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ బుధవారం రూ.71.72 రూపాయలు అలాగే డీజిల్ ధర రూ.66.39 రూపాయలుగా ఉంది.
ముంబైలో బుధవారం పెట్రోలు ధర లీటరుకు రూ. 77.29 రూపాయలు మరియు డీజిల్ రూ .69.48 రూపాయల చొప్పున ధరలు ఉన్నాయి.ధరల్లో నేడు ఎటువంటి మార్పు లేదు.
చెన్నైలో పెట్రోలు లీటరు రూ.74.41 రూపాయల వద్ద రిటైలింగ్ అవుతున్నాయి. అలాగే డీజిల్ ధర రూ. 70.09 గా ఉంది. కోల్కతాలో పెట్రోలు ధర రూ.73.75 రూపాయలుగా ఉండగా డీజిల్ లీటరుకు రూ .68.12 వద్ద విక్రయించింది.
నోయిడాలో పెట్రోలు లీటరుకు రూ.71.28 రూపాయలు, డీజిల్ రూ.65.44 రూపాయలకు విక్రయిస్తూంది.మంగళవారం నుంచి ఎటువంటి మార్పు లేదు.
గత రెండు రోజుల్లో అంతర్జాతీయ ముడి చమురు ధరలు కొన్ని రికవరీలను నిర్వహించాయి. అయితే రూపాయి కూడా డాలర్కు వ్యతిరేకంగా 1 శాతం పైగా పడిపోయింది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బుధవారం ఆసియా వాణిజ్యంలో బ్యారెల్కు సుమారు 61 డాలర్లుగా ట్రేడ్ అయ్యాయి.