ఇంట్లో జనం ఎక్కువుంటే కరెంట్, నీళ్ళు కట్ ఎందుకో తెలుసా?
మన దేశంలో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ అలాగే ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశం కూడా మన భారత దేశమే కానీ ఒక చిన్న గదిలో కూడా కుటుంబంలో నలుగురు కలిసి ఉంటారు.
సింగల్ బెడ్ రూమ్
ఇక సింగల్ బెడ్ రూమ్ అయితే 6 మంది ఖయ్యాం అదే డబల్ లేదా ట్రిపుల్ బెడ్ రూమ్ ఐతే పది మంది పక్క ఉంటారు. మన దగ్గర రూల్స్ ఉండవు ఎంతమంది ఐన ఉండచ్చు అది మనం చేసుకున్న అదృష్టం ఎందుకు ఇలా అదృష్టం అని అంటున్నాము అని అనుకుంటున్నారా మీరే చదవండి.
UAE దేశం
మనందరికీ UAE దేశం తెలుసుగా అరబ్ దేశాలు ఇక్కడ రూల్స్ చాలా వింతగా ఉంటాయి అవి ఏంటో చూద్దాం. షార్జా లో అక్కడి మునిసిపాల్ అధికారాలు నిబంధనలు అమలు చేయడంలో చాలా కఠినంగా ఉంటున్నారు.ఇంట్లో ఎక్కువ మంది ఉంటున్నారు అని తెలిస్తే చాలు కరెంటు, నీళ్లు మొత్తం ఆ ఇంటికి కట్ చేస్తున్నారు.
పవర్ మరియు వాటర్
షార్జా లోని నాసిరియా, మైసోలిన్, అల్మాజాజ్, వంటి ప్రాంతాలలో ఇటీవల మునిసిపాల్ అధికారులు అలాగే పోలీస్ అధికారులు తనిఖీలు చేశారు ఇక్కడ ఉన్న ఇళ్లలో ఎక్కువ మంది ఉంటున్నారు అని గుర్తించారు. ఇంకేముంది ఆ కాలనీలో ఒక 50 ఇళ్లకు పవర్ మరియు వాటర్ సప్లై కట్ చేశారు.
వనరుల వాడకం
ఎక్కువ మంది ఒకే చోట ఉండడం వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతాయి అని రోగాలు త్వరగా వ్యాపిస్తాయి అని అలాగే వనరుల వాడకం పెరుగుతుంది అని అక్కడ అధికారులు భావిస్తున్నారు. కుటుంబాలు ఇబ్బంది పడకూడదు అనే తమ ఉద్దేశం అని అధికారులు చెబుతున్నారు.
పరిమితి మించి జనం
పరిమితి మించి జనం అక్కడ ఉండడం అది చట్ట నిత్య నేరం అక్కడ ఈజీ లాభాల కోసం డబ్బులు ఎక్కువ వస్తాయి అని ఆలోచనతో చిన్న చిన్న గదిలలో బాడుగకు ఇవ్వడం కూడా అక్కడ నేరం ఇలా చేస్తే జైల్లో పెడతారు.