వ్యాపారులకు షాక్ ఇవ్వబోతున్న పాన్ కార్డు కొత్త రూల్ ఏంటో తెలుసా?
ఇక పాన్ కార్డు గురించి అందరికి తెలుసు ఎందుకు ఈ కార్డు వాడతామో అలాగే ఈ కార్డు వల్ల కలిగే ఉపయోగాలు కూడా అందరికి తెలుసు. ఇక ఆదాయపు శాఖ ఈ పాన్ కార్డు గురించి రోజుకో కొత్త రూల్ తీసుకోని వస్తోంది. ఇప్పుడు కొత్తగా వ్యాపారులకు చిన్న షాక్ ఇస్తున్నట్లు తెలుస్తోంది ఏంటో అది చూద్దామా!
కొత్త రూల్
మీ వార్షిక ఆదాయం రూ2 .50 లక్ష దాటుతోందా? అయితే మీరు తప్పకుండ ఈ పాన్ కార్డు కొత్త రూల్ గురించి తెలుసుకోవాలి. ఇక పాన్ కార్డు నిబంధనలో మార్పులు వస్తున్నాయి. అందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉన్న క్రైటీరియా లో ప్రముఖ సవరణలు చేస్తూ ఒక కొత్త రూల్ తీసుకొంది. అయితే ఈ రూల్ కేవలం వ్యాపారులకు మాత్రమే వర్తిస్తుంది
పాన్ కార్డు
ఇక పెద్దగా టర్న్ ఓవర్ లేని వ్యాపారాలకు పాన్ కార్డు తప్పకుండ ఉండాలి అని రూల్ లేదు ఇప్పటివరకు ఆర్ధిక సంవత్సరాలలో రూ.5 లక్షలు టర్న్ ఓవర్ దాటే వ్యాపార సంస్థలకు మాత్రమే పాన్ కార్డు ఉండాలి అని రూల్ ఉండేది.
డిసెంబర్ 5
తాజగా సమాచారం ప్రకారం ఈ రూల్ ని వార్షిక ఆదాయం రూ.5 లక్షల నుండి రూ.2 .50 లక్షల వరకు తగ్గించారు. అంటే ఏటా రూ.2 .50 లక్ష దాటే ప్రతి వ్యాపారికి ఇక నుంచి పాన్ కార్డు తప్పనిసరి. ఈ కొత్త నిబంధన డిసెంబర్ 5 నుంచి అమలులోకి రానుంది.అయితే ఇది వ్యక్తిలుకి వర్తించదు కేవలం వ్యాపారులకు వర్తిస్తుంది
బోగస్ కంపెనీల
ఈ రూల్ కిందకి వచ్చే వ్యాపారులు అంత వచ్చే ఏడాది మే 31 అంతా పాన్ కార్డులు పొందాలి, ఈ కొత్త రూల్ కూడా మంచిదే అని కొందరు నిపుణులు అంటున్నారు ఎందుకంటే కొన్ని బోగస్ కంపెనీల తట తీయడానికే ఆదాయపు శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకోండి అని చెబుతున్నారు.
తండ్రి పేరు
తాజా నిబంధన ప్రకారం తండ్రి పేరు కూడా పాన్ కార్డులో తప్పని సరి కాదు ఒకవేళ తండ్రి లేని వ్యక్తులు తల్లి పేరు చెప్పిన ఆమోదించనున్నారు.