రైల్వే ఉద్యోగులకి జియో బంపర్ ఆఫర్ ఏంటో చూడండి.
రిలయన్స్ జియో టెలికాం రంగంలో గత కొన్ని సంవత్సరాల నుంచి తిరుగు లేకుండా ఒక ఊపు ఊపేస్తోంది. ఒక వైపు కాల్స్ ధరలు మరో వైపు ఇంటర్ నెట్ సేవలు ఇలా ఒకటి ఏంటి ఎన్నో ఆఫర్లతో మిగతా టెలికాం కంపెనీలకు మంచి పోటీ ఇస్తోంది.
తాజాగా
ఇక తాజాగా జియో ఒక బంపర్ ఆఫర్ ఇస్తోంది అది ఏంటో తెలుసా? ఇక నుంచి రైల్వే స్టేషన్లలో జియో సర్వీస్ ప్రొవైడర్ రానుంది అది కూడా కొత్త సంవత్సర కానుకగా ముకేశ్ అంబానీ జనవరి 1 నుంచి ఈ సేవలు అందిస్తోంది. జాతీయ రవాణాదారుల ఫోన్ బిల్లులను కనీసం 35 శాతం వరకు తగ్గించగలమని అధికారులు తెలిపారు.
గత ఆరు సంవత్సరాలుగా భారతీ ఎయిర్టెల్ సర్వీసులు:
అయితే గత ఆరు సంవత్సరాలుగా రైల్వే శాఖలకు భారతి ఎయిర్టెల్ సర్వీసులను నిర్వహిస్తున్నాయని అధికారులు తెలిపారు.ఇక ఇది 1.95 లక్షల మొబైల్ కనెక్షన్లను రైల్వే ఉద్యోగులకు అందిస్తుంది. వారు ఒక క్లోజ్డ్ గ్రూప్ యూజర్లు (CUG) ఎనీ గ్రూప్ ఉపయోగిస్తారు. అదే సమయములో, రైల్వే శాఖకు సంవత్సరానికి రూ. 100 కోట్లు బిల్లును చెల్లించాయని కూడా ఆయన చెప్పారు అయితే ఎయిర్ టెల్ .వ్యాలిడిటీ డిసెంబరు 31 న ముగుస్తుంది అని అధికారులు చెప్పారు.
ఆర్డర్ ప్రకారం
నవంబరు 20 న రైల్వే బోర్డు విడుదల చేసిన ఒక ఆర్డర్ ప్రకారం, "ప్రస్తుత రైల్వే 2018 డిసెంబరు 31 న ముగియనున్నందున భారతీయ రైల్వేలకు తాజా CUG పథకంను పూర్తి చేయాలనే బాధ్యత రైల్వే లకి ఇవ్వబడింది.
రిలయన్స్ జియో
కొత్త CUG స్కీమ్ ను రైల్వే శాఖ ఖరారు చేసింది, రిలయన్స్ జియో ఈ పథకాన్ని అమలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. రిలయన్స్ జియో ఈ పథకం కింద 4G-3G అనుసంధానాన్ని అందిస్తుంది దీనిలో మీకు 4G మరియు 3G అన్ని కాల్స్ ఉచితంగా ఉంటాయి అని తెలిపారు.
రైల్వేలకి జియో 4 రకాల ప్యాకేజీ ఇస్తుంది:
ఇక రైల్వే అధికారులకి నాలుగు రకాల ప్యాకేజీ ఇస్తున్నారు ఇక సీనియర్ అధికారులకి 60 జీబీ ప్లాన్ నెలకి రూ.125 తో వస్తుంది. అలాగే ఇక జాయింట్ సెక్రటరీ ఆఫీసర్లకు నెలకి 45 జీబీ రూ.99 కి మాత్రమే. ఇక స్టాఫ్ కి 30 జీబీ ప్లాన్ నెలకి రూ.67 తో అలాగే రూ.49 తో అపరితమైన మెసేజ్లు వస్తాయి.ఇక అలాగే రైల్వే ఉద్యోగులకి Jio ఇంకో బంపర్ ఆఫర్ ఇస్తోంది అది ఏంటి అంటే ఉద్యోగులు రూ.10 కడితే వారికీ extra 2 GB డేటా వస్తుంది.