ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్: కేవలం రూ.1000 రూపాయలకే విమాన టికెట్లు?
ఇతర ఎయిర్లైన్స్ కు అనుగుణంగా, ప్రభుత్వ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా డిస్కౌంట్ ఆఫర్ను ప్రకటించింది.
ఇతర ఎయిర్లైన్స్ కు అనుగుణంగా, ప్రభుత్వ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా డిస్కౌంట్ ఆఫర్ను ప్రకటించింది, దీని ప్రకారం విమాన టిక్కెట్లను కేవలం రూ. 1,000 రూపాయల అతితక్కువ ధరలకు అందిస్తున్నట్లు ఎయిర్లైన్ వెబ్ సైట్ లో తెలిపింది.
ఈ ఆఫర్ రాత్రి పూట ప్రయాణం కోసం నవంబర్ 30, 2018 నుండి ప్రారంభం కానుంది. బెంగళూరు-అహ్మదాబాద్, ఢిల్లీ-కోయంబత్తూర్, ఢిల్లీ-గోవా మార్గాల్లో ఎయిర్ ఇండియా విమానాలు నడుపుతాయి. ప్రత్యేక ఛార్జీలు రూ. 1,000 నుండి రు. 3000 రూపాయల (పన్నులు వర్తిస్తాయి) నుంచి ప్రారంభమవుతాయి.
నవంబర్ 30, 2018 న, ఎయిర్ ఇండియా మార్గాల్లో ఆకర్షణీయమైన చార్జీలు పరిశీలించండి:
ఎయిర్ఆసియా ఆఫర్
ఇదిలా ఉండగా, బడ్జెట్ క్యారియర్ ఎయిర్ఏషియా ఆదివారం డిస్కౌంట్ ఆఫర్ను ప్రకటించింది, దీని ప్రకారం వన్-వే-రూట్ ఛార్జీలు దేశీయ మరియు అంతర్జాతీయ విమాన టికెట్లు రూ .399 మరియు రూ 1,999 ల నుంచి అందిస్తున్నాయి. డిస్కౌంట్ ఆఫర్ మే 2019 నుండి 2020 ఫిబ్రవరి వరకు వర్తిస్తుంది అలాగే ఇది ఆసియా, ఆస్ట్రేలియా వెలుపల 120 గమ్యస్థానాలకు వర్తిస్తుంది.ప్రయాణీకులకు ఈ వారం నవంబర్ 18 వరకు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు,మే 6 2019 నుండి 4 ఫిబ్రవరి 2020 వరకు దేశీయ మార్కెట్లో 399 రూపాయల చొప్పున అలాగే అంతర్జాతీయ మార్గాల్లో రూ.1,999 రూపాయల నుంచి ప్రయాణిస్తున్నట్లు ఎయిర్ ఆసియ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
వినియోగదారుల మధ్య భారీ ఆసక్తిని రేకెత్తిస్తూ గత కొన్ని నెలలుగా విమాన టిక్కెట్లలో డిస్కౌంట్లను ఆఫర్ చేయటానికి బడ్జెట్ ఎయిర్లైన్స్ మరింతగా ముందుకొచ్చాయి. గోఎయిర్, ఎయిర్ ఆసియా ఇండియా,స్పైస్ జెట్, జెట్ ఎయిర్వేస్ వంటివి కొన్ని ఎయిర్ లైన్స్ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి.