అంబానీ కుటుంబం ఈ దేశానికి ఏమి చేయబోతోంది?
ముకేశ్ అంబానీ అనగానే గుర్తువొచ్చేది అయన ఒక ధనవంతుడు అని చెబుతారు. అలాంటిది జియో తర్వాత రిలయన్స్ సామ్రాజ్యము మరింత పెరిగింది. దాదాపు రిలయన్స్ సామ్రాజ్యము సరికొత్త జనరేషన్ లోకి వచ్చినట్టే.
ఆకాష్
కవలలు ఐన ఆకాష్ ముకేశ్ అంబానీ మరియు ఇషా ముకేశ్ అంబానీలు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మరియు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లో ఇద్దరు బోర్డు అఫ్ డైరెక్టర్స్ గా ఉన్నారు.
4G రెవల్యూషన్
ఇక 4G రెవల్యూషన్ మొత్తం ముకేశ్ అంబానీ పెద్ద కొడుకు ఆకాష్ ప్లాన్ ప్రకారం నడుస్తోంది అంట. ఇక ఇషా మార్కెటింగ్ సహా ఇతర వ్యవహారాలు చూసుకుంటుంది అంట.
చీఫ్ ఫోన్
JIO 4G చీఫ్ ఫోన్ ఐడియా కూడా ఆకాష్ మరియు ఇషా దే అని ముకేశ్ అంబానీ బహిరంగ చెప్పాడు అందుకే jio 4G ఫోన్ లాంచింగ్ ని తన పిల్లలు ఆకాష్ మరియు ఇషా చేతులో పెట్టాడు.
వ్యాపార దిగ్గజాలను
తన పిల్లలు కూడా వ్యాపార దిగ్గజాలను ఆకట్టుకొనే విధంగా ఫోన్ యొక్క ధర మరియు దాని ఫీచర్స్ వివరించి మరి ఆకట్టుకున్నారు .అందుకే తనకు 60 ఏళ్ళు వచ్చాయి 1 లక్ష మంది ఉన్న ఉద్యోగులు ఉన్న JIO ని వీళ్ళే చూసుకుంటారు. కొత్త తరానికి మీ ఆశీస్సులు కావాలని ముకేశ్ అంబానీ కోరారు.
ఇక ముకేశ్ అంబానీ గారి పిల్లల ప్రొఫైల్ ఏంటో తెలుసుకుందామా?
ఆకాష్ మొదటి నుండి మీడియాకు దూరంగా ఉంటాడు. కానీ లగ్జరీ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. కాస్టలీ కార్లు, వాచులు, డ్రస్సులు, బాగా వాడుతాడు. కానీ పెద్దలు అంటే గౌరవం బాగా రిజర్వేడ్ గా ఉంటాడు అని పేరు ఉంది. చదువు విషయంలో వస్తే పెద్ద టాప్ కాకపోయినా పర్వాలేదు అనే లాగా చదువుతాడు అని ఆకాష్ తల్లి నీతూ అంబానీ చెప్పింది. చదువు ఐపోయ్యాక ముకేశ్ అంబానీ దగ్గరే ఇంటర్న్ గా చేరి వ్యాపార మెళుకువలు నేర్చుకున్నాడు. తర్వాత IPL ముంబై ఇండియన్స్ టీంకి కో ఓనర్గా బాగా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు ఏకంగా JIO తో తన సమర్ధతని నిరూపించుకొనే పనిలో ఉన్నాడు. ఫ్రీ డేటా తో పాటు చీఫ్ ఫోన్ అందించడమే కాదు త్వరలో మరిన్ని చోట్లకు వ్యాపారాన్ని విస్తరించేలా చేసాడు.
ఇషా అంబానీ
ఇషా అంబానీ కూడా వ్యాపార రంగం లోకి దిగింది రిలయన్స్ జియో మరియు రిటైల్ లిమిటెడ్ లో బోర్డు అఫ్ డైరెక్టర్ గ పని చేస్తోంది. జియో ఫోన్ డేటా విప్లవం వెనుక ఆమెకు కూడా భాగం ఉంది. అయితే ఆకాష్ కంటే కూడా ఇషా అంబానీ చాల తెలివిగలది అని బయట టాక్. పైగా ఆమెకి డైరెక్ట్ గా రిలయన్స్ లో భారీ షేర్లు ఉన్నాయి. అప్పుడే ఆమె పేరు ధనవంతుల వారసుల జాబితాలో ఉంది. తండ్రికి కూడా అర్థం కానీ విషయాలని ఇషా అంబానీ సహాయం చేసేది అని తన తల్లి నీతూ అంబానీ చెప్పారు.
జియో టెలికాం వెనుక పెద్ద కథే ఉంది
జియో టెలికాం వెనుక పెద్ద కథే ఉంది.టెలి కమ్యూనికేషన్ రంగంలోకి ఏపాటి నుంచో రావాలి అనుకున్న తన తమ్ముడు రిలయన్స్ కమ్యూనికేషన్ తో ఒప్పందం కారణంగా ఈ వ్యాపారిని దూరంగా ఉన్నాడు ముకేశ్ అంబానీ. ఆస్తులను మరియు వ్యాపారాలను పంచుకున్నప్పుడు. టెలి కమ్యూనికేషన్ అనిల్ అంబానీకి వచ్చింది.కాబ్బటి ఆ వ్యాపారం చేయద్దు అని అన్నకి అనిల్ అంబానీ షరతు విధించాడు. నీ వ్యాపారంలోకి నేను రాను నా వ్యాపారంలోకి నువ్వు రాకు అని కలకండిగా చెప్పాడు అనిల్ అంబానీ
వ్యాపారం
ఐతే తమ్ముడు అని అంబానీ దూకుడుగా లేకపోవడంతో ఎయిర్ టెల్ , వోడాఫోన్ , ఐడియాలు, మార్కెట్ ని కొల్లగోట్టుడుతున్నాయి అని ఈ ఒప్పందని పక్కన పెట్టాలి అని తన తల్లితో కలిసి అనిల్ అంబానీని ఒప్పించాడు ముకేశ్ అంబానీ. పైగా కేబుల్ మరియు టవర్లు మొత్తం అనిల్ అంబానీకి ఇచ్చేసి ఒప్పందం కుదుర్చుకొని ఈ వ్యాపారంలోకి దిగాడు ముకేశ్ అంబానీ.
jio 4G
అప్పుడే ఈ jio 4G టెక్నాలజీని ప్రజలకు అతి తక్కువ ధరకి ఎయ్యడానికి ఆకాష్ మరి ఇషా అంబానీలు తన తండ్రి ముకేశ్ అంబానీ దగ్గరికి వచ్చారు అంట.
అనంత్ అంబానీ
ఇక ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ కూడా 18 నెలలలోనే 108 కేజిల బరువు తగ్గాడు బాగా ఆరోగ్యాంగా కూడా తయారు అయ్యాడు. తన కొడుకు సనపడాలి అని నీతా అంబానీ కూడా సింపుల్ డైట్ చేసి ఆమె కూడా మరీఇంత స్లిమ్ గా మరి కొడుకుని సనపడేలా చేసింది అంట. ప్రస్తుతం US లో చదువుకుంటున్న అనంత్ మరో 5 ఏళ్ళు తర్వాత వ్యాపార రంగంలోకి వస్తా అంటున్నాడు. అతను కూడా వస్తే మొత్తం రిలయన్స్ ఇండస్ట్రీ సరికొత్త విప్లవాన్ని చూడబోతోంది అని వ్యాపారవేత్తలు అంటున్నారు.
గర్వంగా
ఏది ఏమైనా ముకేశ్ అంబానీ మంచి వ్యాపారవేత్త మంచి తండ్రి అలాంటిది ముకేశ్ అంబానీనే మా పిల్లలు అతి తక్కువ వయస్సులోనే ఇవి సాధించారు అని గర్వంగా చెప్పేలా చేశారు అయన పిల్లలు.
నిరాడంబర
నిరాడంబర జీవితం గడుపుతూ చిన్న వయస్సులోనే దేశం గర్వించతగ్గ ఆలోచలనలకి నాంది పలుకుతున్న మీరు నిజంగా మీరు చాలామందికి ఆదర్శం అవుతారు. ఇంత చిన్న వయస్సు కి ఇన్ని బాధ్యతలు మోస్తున్న మిమ్మలిని చూసి ఎవరన్నా ముక్కున వేలు వేసుకోవాల్సిందే.