For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లాభాలతో ముగిసిన ఈరోజు దేశీయ మార్కెట్

By girish
|

గత ట్రేడిండ్‌లో నష్టాలను చవిచూసిన దేశీయ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్‌ను మంచి లాభాలతో ముగించాయి. ఉదయం సెన్సెక్స్‌ 34 పాయింట్ల లాభంతో 34,846 వద్ద ప్రారంభం కాగా నిఫ్టీ 10,450 పాయింట్ల పైన ట్రేడింగ్‌ ఆరంభించింది. అయితే సూచీలు అంతలోనే ఒడుదొడుకులకు గురయ్యాయి. ఆరంభ లాభాల నుంచి నష్టాల్లోకి మళ్లాయి. ట్రేడింగ్‌లో ప్రధానంగా ఆయిల్ సంస్థల షేర్లు లాభాలను గడించాయి. ముఖ్యంగా ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం షేర్లు భారీగా లాభపడ్డాయి. చమురు ధరల పతనానికి అడ్డుకట్ట వేసేందుకు వచ్చే నెల నుంచి చమురు ఉత్పత్తిలో కోత విధించనున్నట్లు సౌదీ ప్రకటించడం ఆయిల్ సంస్థలకు వరంగా మారింది.

లాభాలతో ముగిసిన ఈరోజు దేశీయ మార్కెట్

మరోవైపు బ్యాంకులు, ఆటో, లోహ, మౌలిక షేర్లు కూడా ట్రేడింగ్‌లో రాణించడంతో.. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 331.50 పాయింట్లు లాభపడి 35144.49 పాయింట్ల వద్ద, నిఫ్టీ 100.3 పాయింట్లు లాభపడి 10582.50 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 25 పైసలు లాభపడి రూ.72.63 వద్ద ట్రేడవుతోంది.

ఎన్‌ఎస్‌ఈలో ఐషర్ మోటార్స్ (+5.96), ఐవోసీ (+4.70), బీపీసీఎల్ (+4.10), హెచ్‌పీసీఎల్ (+3.44), అల్ట్రాటెక్ సిమెంట్ (+2.77) షేర్లు అధికంగా లాభపడ్డాయి. మరోవైపు సన్ ఫార్మా(-4.71), టాటా మోటార్స్ (-3.52), ఇండియాబుల్స్ హౌసింగ్ (-2.69), పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ (-1.02), సిప్లా (-0.71) షేర్లు అధిక నష్టాలను చవిచూశాయి.

Read more about: stock market
English summary

లాభాలతో ముగిసిన ఈరోజు దేశీయ మార్కెట్ | Stock Market Today

The domestic markets, which suffered losses in last trading, ended trading on Tuesday with good profit. In the morning session, the Sensex opened 34 points higher at 34,846 and the Nifty began trading at 10,450.
Story first published: Tuesday, November 13, 2018, 17:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X