కొన్ని నెలల విరామం తరువాత ఇంధన రిటైలర్లు ఈ రోజు నుండి ఎల్పిజి సిలిండర్ల ధరను పెంచారు.
కొన్ని నెలల విరామం తరువాత ఇంధన రిటైలర్లు ఈ రోజు నుండి ఎల్పిజి సిలిండర్ల ధరను పెంచారు. 14.2 కిలోల సబ్సిడైజ్డ్ ఎల్పిజి సిలిండర్ ధర రూ. 2.94 రూపాయలు పెరిగింది. నాన్ సబ్సిడైజ్డ్ సిలిండర్ ధర 60 రూపాయలకు చేరుకుంది. ప్రతినెల ప్రారంభంలో వంటగ్యాస్ ధరలు సవరించబడతాయి.

సబ్సిడైజ్డ్ ఎల్పిజి సిలిండర్
ఢిల్లీలో సబ్సిడైజ్డ్ ఎల్పిజి సిలిండర్ రూ.505.34 రూపాయలు, కోలకతాలో 508.7 రూపాయలు, ముంబై రూ .503.11 రూపాయలు మరియు చెన్నై లో రూ .493.87 రూపాయలుగా ధరలు నమోదయ్యాయి. గత ఆరు నెలల్లో సిలిండర్ ధర రూ. 14.13 రూపాయల మేర పెరిగింది.

నాన్ సబ్సిడైజ్డ్ సిలిండర్
నాన్ సబ్సిడైజ్డ్ కేటగిరిలో ఎల్పిజి సిలిండర్ ఢిల్లీలో రూ .939 రూపాయలు, కోల్కతా లో రూ. 939.5 రూపాయలు,ముంబై రూ .912 రూపాయలు మరియు చెన్నై లో రూ. 958 రూపాయల ధరలు కొనసాగుతున్నాయి.

ప్రభుత్వం సబ్సిడీ
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డిబిటి) పథకం కింద ఏడాదికి ప్రతి ఇంటికి 12 గృహా సిలిండర్లకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది.

GST(జిఎస్టి)
ద్రవీకృత పెట్రోలియం వాయువు యొక్క అంతర్జాతీయ ధరల పెరుగుదల ప్రభుత్వం సబ్సిడీగా పొందుతుంది కానీ GST లో తదుపరి పెరుగుదల వినియోగదారులకు పంపబడుతుంది, ఇది రేటు పెంచడానికి దారితీస్తుంది.

పెరుగుదలకు గల ప్రధాన కారణాలు
ఢిల్లీలో నాన్ సబ్సిడైజ్డ్ వంటగ్యాస్ పై ధర నవంబర్ 2018 నాటికి సిలిండర్కు 60 రూపాయల మేర పెరగనుంది. ప్రధానంగా అంతర్జాతీయ ధరల మార్పు, విదేశీ మారకపు ఒడిదుడుకుల మార్పుల వల్ల సబ్సిడీ దేశీయ ఎల్పిజి వినియోగదారులపై వాస్తవ ప్రభావం కేవలం రూ.2.94 రూపాయలు మాత్రమే. ప్రధానంగా జిఎస్టి కారణంగా ఇది ఉంది అని ఇండియన్ ఆయిల్ నుండి వచ్చిన ఒక ప్రకటన తెలిపింది.

బ్యాంకు ఖాతాలో సబ్సిడీ
వినియోగదారుల బ్యాంకు ఖాతాలో సబ్సిడీ బదిలీ నవంబర్ 2018 నుండి సిలిండర్కు 433.66 రూపాయలకు పెరిగింది ఇది అక్టోబర్ 2018 నాటికి సిలిండర్కు రూ.376.60 రూపాయలు సబ్సిడీ జమ చేయబడేది.

సబ్సిడీ అదనంగా
వారి బ్యాంకు ఖాతాకు సబ్సిడీ బదిలీ పెంపు ద్వారా కస్టమర్కు బ్యాలెన్స్ రూ 57.06 రూపాయలు అదనంగా జమచేయబడుతుంది.నవంబర్లో రూ.433.66 రూపాయలకు పెరిగింది. అక్టోబర్లో ఇది సిలెండర్కు 376.60 రూపాయలు ఉండేది.


Click it and Unblock the Notifications