శనివారం పెట్రోలు, డీజిల్ ధరలు మరింతగా తగ్గుముఖం పట్టాయి.
పెట్రోలు, డీజిల్ ధరలు శనివారం కూడా తగ్గాయి. లీటరుకు పెట్రోల్ ధరలు 18-20 పైసలు తగ్గాయి అదేవిదంగా డీజిల్ ధర లీటరుకు 12-15 పైసలు పడిపోయింది.
పెట్రోలు, డీజిల్ ధరలు శనివారం కూడా తగ్గాయి. లీటరుకు పెట్రోల్ ధరలు 18-20 పైసలు తగ్గాయి అదేవిదంగా డీజిల్ ధర లీటరుకు 12-15 పైసలు పడిపోయింది. ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో పెట్రోల్ ధరలు కూడా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు రూ.78.99 రూపాయల చొప్పున తగ్గాయి నిన్నటి ధర రూ .79.18 రూపాయలుగా ఉంది. డీజిల్ రూ.73.64 రూపాయల నుండి రూ.73.53రూపాయల వద్ద విక్రయించబడుతోందని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్సైట్లో లభించిన సమాచారం వెల్లడించింది. బ్యారెల్ క్రూడ్ ధరలు అంతర్జాతీయ బ్యారెల్ ధరల బెంచ్మార్క్ బ్యారెల్కు 72.57 డాలర్ల స్థాయికి పడిపోయాయి. దాని ఇటీవలి అధిక ధర 86 డాలర్లు నమోదయినది.
గత రెండు వారాలుగా ఇంధన ధరలు తగ్గుముఖం పట్టడం వల్ల వినియోగదారులకు కాస్త ఉపశమనం లభించిందని చెప్పవచ్చు.
ముంబయిలో శుక్రవారం ధరతో పోలిస్తే పెట్రోలు పై ధర 19 పైసలు తగ్గి రూ.84.49 రూపాయలుగా ఉంది. అలాగే, డీజిల్ ముంబైలో 12 పైసలు పడిపోయింది.
మరో రెండు మెట్రో నగరాల్లో చెన్నై, కొలకత్తా లో పెట్రోల్ ధరలు వరుసగా రూ.82.06 రూపాయలు, రూ.80.89 రూపాయల చొప్పున అమ్మకాలు జరుగుతున్నాయి. డీజెల్ రూ.77.73 రూపాయలు మరియు రూ.75.39 రూపాయల వద్ద ధర ఉంది. గత 15 రోజుల్లో ఢిల్లీలో పెట్రోలు పై ధర రూ.3.28 రూపాయలు తగ్గింది. డీజిల్ ధర రూ. 1.84 రూపాయలు తగ్గింది.
గత నెలలో మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.1.50 రూపాయల చొప్పున తగ్గించింది. లీటరుకు రూ. 1 చొప్పున ఇంధన సబ్సిడీపై పిఎస్యు మినహాయింపు చేయాలనీ చమురు సంస్థలను కోరింది. లీటరు పెట్రోల్, డీజిల్పై పన్నులు తగ్గించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. కేంద్రం యొక్క అభ్యర్థనను అనుసరించి గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యానా వంటి రాష్ట్రాలు ఇంధన ధరలను తగ్గించాయి.
అయితే, ఢిల్లీ ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్పై వ్యాట్ ను తగ్గించలేదు. ఢిల్లీతో పోలిస్తే పెట్రోల్ మరియు డీజిల్ ధరలు నోయిడాలో ప్రస్తుతం తక్కువ ధర వుంది. ప్రస్తుతం నోయిడాలో పెట్రోలు రూ.77.14 రూపాయలకు విక్రయిస్తోంది. డీజిల్ రూ.71.80 రూపాయల ధర ఉంది.