ఈరోజు నుండి ఎస్బిఐ ఎటీఎం ద్వారా నగదు వుపసంహరణ ఎంతో తెలుసా?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) క్లాసిక్, మాస్ట్రో డెబిట్ కార్డులు బుధవారం నుంచి అంటే అక్టోబర్ 31 నుండి ఎటీఎం ద్వారా కేవలం రూ.20,000 మాత్రమే ఉపసంహరణ చేయవచ్చు అని తెలిపారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) క్లాసిక్, మాస్ట్రో డెబిట్ కార్డులు బుధవారం నుంచి అంటే అక్టోబర్ 31 నుండి ఎటీఎం ద్వారా కేవలం రూ.20,000 మాత్రమే ఉపసంహరణ చేయవచ్చు అని తెలిపారు. అయితే,ఇదివరకు ఉన్న రూ.40,000 ఉపసంహరణ నుండి కుదించేశారు.

ఎస్బిఐ అధికారులు మాట్లాడుతూ ఎటీఎం లలో జరుగుతున్న మోసాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుకున్నారు వీటిని అరికట్టేందుకు మరియు డిజిటల్ / నగదు లావాదేవీలను ప్రోత్సహించటానికి, డెబిట్ కార్డుల యొక్క నగదు ఉపసంహరణ పరిమితులను తగ్గించాలని నిర్ణయించబడింది అక్టోబర్ 31, 2018 నుండి అమలులో ఉన్న 40,000 నుండి రు. 20,000 రూపాయలు మాత్రమే ఉపసంహరణ చేయగలరని వెల్లడించారు.
డిజిటల్ లావాదేవీలను మరింతగా ప్రోత్సహించేందుకు అలాగే ఎటిఎంల నుండి మోసపూరితమైన నగదు ఉపసంహరణలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎస్బిఐ మేనేజింగ్ డైరెక్టర్ పికె గుప్తా చెప్పారు.
అన్ని ఎటిఎం ల లావాదేవీలను విశ్లేషించి, అధికారులు ఉపసంహరణలు రూ .20,000 రూపాయలకు కుదించినట్టు తెలిపారు. అయితే, మోసపూరితమైన ఉపసంహరణ కేసుల్లో ఎక్కువ శాతం రు. 40,000 రూపాయలుగా ఉన్నట్లు గుప్తా పేర్కొన్నారు.కావున ఇటువంటి నేరాల నుండి వినియోగదారులను రక్షించడానికి ప్రధానంగా ఉంటుంది మరియు రెండవది,డిజిటల్ లావాదేవీలు చేయడం వల్ల అధిక శాతం లో నేరాలు తగ్గుతాయని గుప్తా పిటిఐ లో పేర్కొంది.


Click it and Unblock the Notifications