For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్

By girish
|

వరుస నష్టాల నుంచి కోలుకున్న దేశీయ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ సానుకూల పరిణామాలకుతోడు దేశీయంగా కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సూచీలు ట్రేడింగ్ ఆరంభం నుంచే లాభాలను అందుకున్నాయి. ట్రేడింగ్ ఆరంభంలో 200 పాయింట్లకుపైగా సెన్సెక్స్, 40 పాయింట్ల లాభంతో నిఫ్టీ మొదలయ్యాయి. ఆ తర్వాత కాస్త జోష్ తగ్గినప్పటికీ తిరిగి పుంజుకున్న మార్కెట్లు చివరికి భారీ లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా ఫార్మా, బ్యాంకింగ్‌, మెటల్, ఆటోమొబైల్‌ రంగాల షేర్లలో కొనుగోళ్లతో సూచీలు ఎగబాకాయి.

లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్

ట్రేడింగ్‌లో ఐసీఐసీఐ షేర్ విలువ 10.69 శాతం పెరిగి మేర లాభాలతో రాణించింది. సెప్టెంబరు త్రైమాసికంలో బ్యాంకు నికర లాభం క్షీణించినప్పటికీ ఆ ఫలితాలు బ్యాంకు షేర్లపై ప్రభావం చూపకపోవడం విశేషం.

ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 718.09 పాయింట్ల లాభంతో 34,067 వద్ద, నిఫ్టీ 220 పాయింట్ల లాభంతో 10,250.85 స్థాయికి చేరింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ కాస్త కోలుకుని 73.44గా కొనసాగుతోంది.

ఎన్‌ఎస్‌ఈలో.. ఇండియన్ బుల్స్ హౌసింగ్ (12.82), ఐసీఐసీఐ బ్యాంక్‌ (10.69), ఎస్‌బీఐ(7.98) అదానీపోర్ట్స్ (7.33), యాక్సిస్ బ్యాంక్ (5.39) టాప్ గెయిర్లుగా నిలిచాయి. మరోవైపు ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.28), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (-1.78), కోటక్ మహింద్రా (-1.77), ఐషర్ మోటార్స్ (-1.58), భారతీ ఎయిర్‌టెల్ (-1.29) షేర్లు అధికంగా నష్టాలను చవిచూశాయి.

Read more about: stock market
English summary

లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్ | Stock Market Ends With Profits Today

Sensex gains marginally in early trade Indexes attracted profits from the beginning of the trading, with international positive outflows.
Story first published: Monday, October 29, 2018, 16:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X