మరోసారి తగ్గిన పెట్రోల్ ధరలు.మెట్రో నగరాల్లో ధరలు ఈవిదంగా ఉన్నాయి
చమురు మార్కెటింగ్ కంపెనీలు నాలుగు మెట్రో నగరాల్లో పెట్రోలు ధరలు వరుసగా పదకొండో రోజు తగ్గించాయి.
చమురు మార్కెటింగ్ కంపెనీలు నాలుగు మెట్రో నగరాల్లో పెట్రోలు ధరలు వరుసగా పన్నెండవ రోజు తగ్గించాయి.ఢిల్లీ లో లీటర్ పెట్రోల్ ధర రూ.80 రూపాయలకంటే తక్కువ నమోదు చేసాయి పెట్రోల్ ధర న్యూఢిల్లీలో ఢిల్లీలో సోమవారం లీటర్ పెట్రోల్ ధర 30 పైసలు తగ్గి రూ. 79.75గా ఉంది. ఇక డీజిల్ కూడా 20 పైసలు తగ్గి రూ. 73.85గా ఉంది,కోల్కతాలో లీటరుకు రూ.81.6 రూపాయలు,ముంబయిలో లీటరుకు రూ.85.24 రూపాయలు మరియు చెన్నైలో లీటరుకు రూ.82.86 రూపాయలు ధరలు ఉన్నాయని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఒసి) తెలిపింది.
అలాగే డీజిల్ న్యూఢిల్లీలో లీటరుకు రూ. 74.38 రూపాయలు,కోల్కతాలో లీటరుకు రూ. 75.70 రూపాయలు, ముంబయిలో లీటరుకు రూ. 77.40 రూపాయలు మరియు చెన్నైలో లీటరుకు రూ.78.08.రూపాయల ధరలు నమోదయ్యాయి.డాలర్ రేటు మరియు అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఆధారంగా పెట్రోల్ మరియు డీజిల్ రేట్లు రోజువారీగా చమురు-మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయిస్తాయి.
ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి ఇంధన ధరలను సవరిస్తారు.గత ఏడాది జూన్ మధ్యకాలంలో ఇంధన రేట్లను రోజువారీగా పునర్విమర్శ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది.
ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు శుక్రవారం పెరిగాయి. ఇరాన్ పై US ఆంక్షలు ప్రపంచ సరఫరాను కఠినతరం చేస్తాయని అంచనా వేసినప్పటికీ, ఫ్యూచర్స్ స్టాక్ మార్కెట్లలో ప్రతిష్టంభన తగ్గుముఖం పడుతున్నాయని నిపుణులు వెల్లడించారు.
బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 73 సెంట్ల లేదా 1 శాతం పెరిగింది,ముడి చమురు $ 77.62 బ్యారెల్ వద్ద స్థిరపడింది. ప్రపంచ బెంచ్మార్క్ వారాంతపు నికర నష్టం 2.7 శాతం మరియు మూడు వారాలలో $ 10 శతం తగ్గింది.
US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ముడి ఫ్యూచర్స్ 26 సెంట్లు, లేదా 0.4 శాతం పెరిగాయి, అది 67.59 డాలర్ల బ్యారెల్ వద్ద ముగిసింది. ఇది 2.3 శాతం వారాంతపు నష్టాన్ని నమోదు చేసింది.