వరుసగా తొమ్మిదవ రోజు తగ్గిన పెట్రోల్ ధరలు?
శుక్రవారం పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా తొమ్మిదవ రోజున తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంతో డాలర్కు వ్యతిరేకంగా రూపాయి కూడా బలపడింది.
శుక్రవారం పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా తొమ్మిదవ రోజున తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంతో డాలర్కు వ్యతిరేకంగా రూపాయి కూడా బలపడింది. దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో పెట్రోలు ధర లీటరుకు సుమారు 25 పైసలు తగ్గాయి. డీజిల్ ధర లీటరుకు 7 పైసలు చొప్పున తగ్గాయి.
ఢిల్లీలో పెట్రోలు లీటరుకు రూ.81 రూపాయల నుండి 25 పైసలు తగ్గి రూ.80.85 రూపాయలకు విక్రయించబడుతోంది. డీజిల్ లీటరు రూ .74.73 వద్ద రిటైలింగ్ అయింది. అదేవిధంగా, ముంబైలో పెట్రోలు లీటరుకు రూ. 86.33 రూపాయల వద్ద విక్రయించగా, డీజిల్ లీటరుకు రూ .78.33 గా ఉంది.
బ్రెంట్ క్రూడ్, అంతర్జాతీయ ముడి చమురు బెంచ్మార్క్, దాదాపు $ 86 బ్యారెల్ పై $ 10 డాలర్లు తగ్గి శుక్రవారం ఆసియా వ్యాపారంలో సుమారు $ 76 కు చేరింది.
చెన్నై లో పెట్రోల్ ధర రూ.84.02 రూపాయలు, డీజిల్ ధర రూ .79.02 రూపాయలు, కోల్కతాలో పెట్రోలు ధర రూ.82.71 రూపాయలుగా ఉంది, డీజిల్ ధర రూ.76.58 రూపాయలకు విక్రయిస్తోంది.
ఇదే నెలలో మోడీ ప్రభుత్వం పెట్రోలు,డీజిల్ పై ఎక్సైజ్ సుంకం 1.50 రూపాయల మేర తగ్గించింది. లీటరుకు రూ. 1 చొప్పున ఇంధన సబ్సిడీపై పిఎస్యు చమురు సంస్థలను కోరింది. లీటరు పెట్రోల్,డీజిల్ పై పన్నులు తగ్గించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది.
కేంద్రం యొక్క అభ్యర్థనను అనుసరించి, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యానా వంటి అనేక రాష్ట్రాలు ఇంధన ధరలను తగ్గించాయి కాని ఢిల్లీ ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గించలేదు.
ఈ దరల తగ్గింపుతో పెట్రోల్ మరియు డీజిల్ పై నోయిడాలో ధర తక్కువగా వుంది. నోయిడాలో పెట్రోలు రూ.78.45 రూపాయల వద్ద విక్రయించగా, డీజిల్ ధర రు .72.84 గా ఉంది.