For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్లు

|

వరుస నష్టాల తరువాత దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ సానుకూల పరిణామాలు, కొనుగోళ్లు పెరగడంతో ఉదయం మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. దీంతో సెన్సెక్స్ మళ్లీ 34 వేల పాయింట్ల స్థాయికి ఎగబాకింది. నిఫ్టీ కూడా 100 పాయింట్లకు పైగా లాభంతో జోరుగా కదలాడింది. ఫైనాన్స్, విద్యుత్‌, మెటల్, ఫార్మా షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. అయితే కొద్ది సేపట్లోనే ప్రారంభ లాభాలు డీలా పడ్డాయి. మధ్యాహ్నా సమయానికి ఓ దశలో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే చివర్లో సూచీలు పుంజుకోవడంతో మరోసారి నష్టాల బారిన పడకుండా మార్కెట్లు నిలిచాయి.

లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్లు

ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 186.73 పాయింట్లు లాభపడి 34033.96 వద్ద, నిఫ్టీ 79.95 పాయింట్లు లాభపడి 10224.75 వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 38 పైసలు బలపడి 73.19 వద్ద ట్రేడ్ అవుతోంది. బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి.

బజాజ్ ఫైనాన్స్ (10.97), భారతీ ఎయిర్‌టెల్ (10.48), హెచ్‌పీసీఎల్ (6.82), ఐవోసీ (5.81), హిండాల్కో (4.72) షేర్లు అధికంగా లాభాలను ఆర్జించాయి. మరోవైపు.. యస్ బ్యాంక్ (-4.32), బజాజ్ ఆటో (-4.31), గ్రాసిమ్ (-2.05), డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ (-1.59), అదానీ పోర్ట్స్ (-1.52) అధికంగా నష్టాలను చవిచూశాయి

Read more about: stock market
English summary

లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్లు | Stock Market Ends with Profits

After the losses, the domestic stock markets closed with gains on Wednesday. International positive developments and purchases started with good profit in the morning.
Story first published: Wednesday, October 24, 2018, 17:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X