వరుసగా ఆరవరోజు తగ్గుముఖం పట్టిన పెట్రోల్ ధరలు.
భారీగా పెరిగిన పెట్రోల్ దరల నుండి వినియోగదారులకు ఉపశమనం కలిగించే విషయంలో భాగంగా పెట్రోల్ ధరలు బుధవారం మరింత తగ్గింపును కొనసాగించాయి.
భారీగా పెరిగిన పెట్రోల్ దరల నుండి వినియోగదారులకు ఉపశమనం కలిగించే విషయంలో భాగంగా పెట్రోల్ ధరలు బుధవారం మరింత తగ్గింపును కొనసాగించాయి.
ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు తొమ్మిది పైసలు తగ్గా రూ.81.25 రూపాయల వద్ద ధర నమోదయినది అదేవిదంగా ముంబయిలో ఎనిమిది పైసల తగ్గింపు తర్వాత ధర రూ .86.73 వద్ద ఉంది.
అయితే డీజిల్ పై,ఢిల్లీ మరియు ముంబయిలో ఎటువంటి మార్పు లేదు లీటర్ డీజిల్ రూ.74.85 రూపాయలుగా నమోదయినది.
ఇంధన ధరలు పెరగడం గత కొద్ది నెలలుగా దేశంలో సాధారణ ప్రయాణికుల జేబులకు చిల్లులు పడుతుండటం తో ప్రభుత్వం దరల నియంత్రణ కు ప్రయత్నిస్తోంది.
అక్టోబర్ 4 న పెట్రోలు, డీజిల్ ధరలపై లీటరుకు రూ .2.50 రూపాయల చొప్పున తగ్గించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.
ఇటీవల ఇంధన ధరలు తగ్గుముఖం పట్టడంతో ముడి చమురు ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. బ్రెంట్ ముడి చమురు గత వారం బ్యారెల్కి 86 డాలర్ల వద్ద విక్రయించింది. అయితే, ధరలు వేగంగా పడిపోయాయి. బ్లూమ్ బెర్గ్ ప్రకారం, బ్రెంట్ ముడి చమురు ధర ప్రస్తతం 76.80 డాలర్ల వద్ద ఉంది.
భారతదేశం ప్రపంచంలోని మూడవ అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉన్నందున, ముడి చమురు ధరల అస్థిరత దేశీయంగా ఇంధన ధరలను ప్రభావితం చేస్తుంది.