భారతదేశంలో అతిపెద్ద ఎయిర్ క్యారియర్ ఇండిగో కొత్త ప్రమోషనల్ ఆఫర్, రూ .899 రూపాయల నుండి దేశీయ ప్రయాణ కోసం అలాగే రూ .3,939 రూపాయల నుండి అంతర్జాతీయ ప్రయాణాలకు ప్రవేశపెట్టింది.
భారతదేశంలో అతిపెద్ద ఎయిర్ క్యారియర్ ఇండిగో కొత్త ప్రమోషనల్ ఆఫర్, రూ .899 రూపాయల నుండి దేశీయ ప్రయాణ కోసం అలాగే రూ .3,939 రూపాయల నుండి అంతర్జాతీయ ప్రయాణాలకు పారవేశపెట్టింది.ఈ బుకింగ్స్ దీపావళికి మూడు రోజుల ముందు ప్రత్యేక విక్రయాలు కేవలం రూ.899 రూపాయల నుండి ప్రారంభం కానుంది. ఈ ఆఫర్ అక్టోబరు 24, 2018 నుండి 26 దాక అందుబాటులో ఉంటుంది. ఆఫర్ ప్రయాణం నవంబర్ 8 2018 నుండి ఏప్రిల్ 15 2019 మధ్య ప్రయాణం వర్తిస్తుందని సంస్థ వెబ్ సైట్ లో పేర్కొంది.

దీపావళి ఆఫర్ కింద ఎన్ని సీట్లను విక్రయానికి ఉంచిందో సంఖ్యను ఇండిగో ప్రకటించలేదు. "లిమిటెడ్ ఆఫర్ క్రింద అందుబాటులో ఉంచింది అందువలన లిమిటెడ్ గా ఉన్న సీట్లపై మాత్రమే కస్టమర్లకు డిస్కౌంట్లు అందిస్తామని ఎయిర్లైన్ వెబ్సైట్లో పేర్కొంది.
ఇండిగో మాట్లాడుతూ, రూ.899 ఆఫర్ టికెట్ "ఆఫర్ వ్యవధిలో బుకింగ్ చేసుకున్న వాటికి మాత్రమే చెల్లుబాటు అవుతుందని పేర్కొంది, చెల్లుబాటు అయ్యే తేదీకి కనీసం 15 రోజులు ముందుగా ప్రయాణ తేదీ ఉండాలి, ప్రయాణ ఆఖరి తేదీ 2019 ఏప్రిల్ 15 అని పేర్కొంది.
ఇండిగో యొక్క దేశీయ మరియు అంతర్జాతీయ నెట్వర్క్ లో వివిధ రంగాల్లో నాన్ స్టాప్ విమానాల్లో మాత్రమే ఈ ఆఫర్ చెల్లుతుంది మరియు ఏ ఇతర ఆఫర్, స్కీమ్ లేదా ప్రమోషన్ తో కలిపి ఉండకూడదు," అని ఎయిర్లైన్స్ తన సైట్ లో పేర్కొంది.
భారతదేశంలో ఎయిర్లైన్స్ విపరీతమైన పోటీ డిమాండ్ మార్కెట్లో పెంచడానికి చూస్తున్నందువల్ల అమ్మకాలు మరింత ఆకర్షణీయంగా మారాయి. ప్రపంచంలో వేగంగా పెరుగుతున్న దేశీయ విమానయాన మార్కెట్లలో ఒకటి అయిన ఇండిగో, స్పైస్ జెట్ మరియు జెట్ ఎయిర్వేస్ కఠినమైన వ్యాపార పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి, ముఖ్యంగా చమురు ధరలు మరియు రూపాయి విలువ తగ్గుముఖం పట్టడం ప్రధాన కారణం.
ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో దేశీయ ఎయిర్లైన్స్ తీసుకెళ్లిన ప్రయాణీకులు దాదాపు 21 శాతం పెరిగింది. దేశీయ ఎయిర్లైన్స్ జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో 10.27 కోట్ల మంది ప్రయాణీకులను తీసుకుంది. గత ఏడాది ఇదే కాలంలో 8.49 కోట్ల మంది ప్రయాణికులు ఉన్నారు.


Click it and Unblock the Notifications