జిఎస్టి రిటర్నుల దాఖలు గడువు పొడిగించిన కేంద్రం.
సెప్టెంబరు నెలకు దాఖలు చేయాల్సిన జిఎస్టి రిటర్నుల గడువు ఈ నెల 25 వరకు పొడిగిస్తూ కేంద్ర ఆర్థికశాఖ నిర్ణయం తీసుకుంది.
సెప్టెంబరు నెలకు దాఖలు చేయాల్సిన జిఎస్టి రిటర్నుల గడువు ఈ నెల 25 వరకు పొడిగిస్తూ కేంద్ర ఆర్థికశాఖ నిర్ణయం తీసుకుంది . ఈ నిర్ణయం ద్వారా 2017 జూలై నుండి 2018 మార్చి కాలానికి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటిసి) పొందాలనుకునే వ్యాపార సంస్థలు ఈ నెల 25 వరకు దాఖలు చేసుకోవచ్చని తెలిపింది.
2017 జూలై-2018 మార్చ్ నాటికి జిఎస్టి కింద ఐటీసీ క్లెయిమ్ చేయడానికి అక్టోబరు 20 డక్ గడువు ఉండటాన్ని చూసి వ్యాపార సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డు అఫ్ ఇండైరెక్ట్ అండ్ కస్టమ్స్ (CBIC) తెలిపాయి. అందుచేత సెప్టెంబర్ నెలకు సంబంధించి జీఎస్టీఆర్-3బి దాఖలు గడువును అక్టోబర్ 25వరకు పొడిగిస్తునట్టు CBIC తెలిపింది.
గడిచిన నెలకు సంబంధించి జీఎస్టీఆర్-3బి తదుపరి నెలలో 20 వరకు దాఖలు చేయవలసి ఉంటుంది అని నిబంధన. సెప్టెంబర్ రిటర్న్ ఫైలింగ్ అక్టోబరు 20 వ తేదీన ముగిసింది. వ్యాపార సంస్థలు అక్టోబరు 20 గడువుకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేశాయి, తమ పంపిణీదారుల ద్వారా దాఖలు చేసిన కొనుగోలు రిటర్న్స్తో వారి అమ్మకాల రిటర్న్లను సమన్వయ పరచడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని తెలిపారు.
అయితే, సెప్టెంబర్ నెల జీఎస్టీ రిటర్నుల దాఖలు గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించాలని అఖిల భారత వ్యాపారుల సంఘం (సీఏఐటీ) డిమాండ్ చేసింది.
గూడ్స్ అండ్ సర్వీసీస్ ట్యాక్స్ (జిఎస్టి) ను జూలై 1, 2017 న విడుదల చేశారు.
ప్రభుత్వం ఈ గడువును పొడిగించడానికి గల ఉద్దెశం వ్యాపారాలకు అనుకూలమైన పర్యావరణాన్ని సృష్టించడం కంటే ప్రజల అవగాహనను పెంచడానికి మాత్రమే అని ఆయన చెప్పారు.