పెరిగిన ఉల్లి ధరలతో ప్రజలకు కన్నీళ్లు తెప్పిస్తోంది.
న్యూ ఢిల్లీ లో టోకు, రిటైల్ ఉల్లిపాయల ధరలు గత 10 రోజుల్లో ఆకాశాన్ని తాకాయి. టోకు ధరల పెరుగుదల కిలో రూ.23 రూపాయల చొప్పున పెరిగిందని న్యూస్ ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పిటిఐ) నివేదించింది.
న్యూ ఢిల్లీ లో టోకు, రిటైల్ ఉల్లిపాయల ధరలు గత 10 రోజుల్లో ఆకాశాన్ని తాకాయి. టోకు ధరల పెరుగుదల కిలో రూ.23 రూపాయల చొప్పున పెరిగిందని న్యూస్ ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పిటిఐ) నివేదించింది.నాణ్యత మరియు ప్రాంతం ఆధారంగా, ఉల్లిపాయలు కిలో రూ.30-40 రూపాయల వరకు ధరలు పలుకుతున్నాయి.ఉల్లి ధర 10 రోజుల ముందు కిలో 7 -10 రూపాయలు పలికాయని ఉల్లిపాయ, బంగాళాదుంప వ్యాపారుల అసోసియేషన్ (ఆజాద్పూర్ మండి) జనరల్ సెక్రటరీ రాజేంద్ర శర్మ పిటిఐ నివేదికలో పేర్కొన్నట్లు వెల్లడించారు.
పండుగల సీజన్ విరామం కారణంగా రైతులు సాగుచేయడం ఇంకా ప్రారంభించలేదు అని ఆయన అన్నారు. అందువలన, ఉల్లిపాయల ఖరీఫ్ పంట రావడం ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులో లేదన్నారు. ఉల్లిపాయల యొక్క పాత మరియు కొత్త పంటల మధ్య ధర అంతరం కూడా తగ్గింది.
ఇంతలో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా నసల్ గోన్ ఆసియాలో అతిపెద్ద ఉల్లిపాయల మార్కెట్లో ధరలు పెరిగిపోయాయి.ధరలు సుమారు ఒక కిలో రూ.21-22 రూపాయల ధర పలుకుతోంది దీనికి ప్రధాన కారణం రాష్ట్రము లో ఖరీఫ్ పంట పూర్తి స్థాయిలో లేకపోవడం .లాసాల్గోన్ మార్కెట్లో ఏడాది క్రితం కిలో 15 రూపాయలు, అధికారిక సమాచారం ప్రకారం.
మహారాష్ట్ర, గుజరాత్, ఒరిస్సా, కర్నాటక, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బీహార్, పంజాబ్, రాజసన్ లు ప్రధానమైన ఉల్లిపాయల తయారీ రాష్ట్రాలు అని తెలిపింది .