పండుగల నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
బిఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) దసరా, దీపావళి సందర్భంగా కొత్త ప్రీపెయిడ్ రీఛార్జి తో ముందుకు వచ్చిందని మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్ లో టెలికాం ఆపరేటర్ పేర్కొన్నారు.
బిఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) దసరా, దీపావళి సందర్భంగా కొత్త ప్రీపెయిడ్ రీఛార్జి తో ముందుకు వచ్చిందని మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్ లో టెలికాం ఆపరేటర్ పేర్కొన్నారు.అక్టోబర్ 15 నుంచి బిఎస్ఎన్ఎల్ యొక్క కొత్త ప్యాక్ యొక్క ప్రయోజనాలు వినియోగదారులకు అందుబాటులో రానున్నాయి . ఇటీవలే బిఎస్ఎన్ఎల్, పోటీదారుల టెలికాం రంగాల్లో తన కస్టమర్ బేస్ను పెంచుకొని మరియు కొనసాగించడానికి ప్రీపెయిడ్ ప్యాక్లతో ముందుకు వచ్చింది. 2016 లో రిలయన్స్ జీయో రావడం ద్వారా టెలికాం రంగాల్లో గట్టి పోటీ ఎదుర్కొంటున్నాయి.
బిఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్యాక్ వివరాలు:
ప్రీపెయిడ్ ప్లాన్ రూ.78
దాని కొత్తరీఛార్జి రూ.78 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్,బిఎస్ఎన్ఎల్ అపరిమిత వాయిస్ మరియు వీడియో కాల్స్ అందిస్తోంది. ప్యాక్ లో రోజుకు 2 GB డేటాను అందిస్తుంది మరియు రోజువారీ పరిమితిని వినియోగించిన తర్వాత, వేగం 80 kbps కి తగ్గించబడుతుంది.
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 10 రోజులు చెల్లుతుంది.
రిలయన్స్ జియో
ఇంతలో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో 100 శాతం క్యాష్బ్యాక్ ఆఫర్ను ప్రకటించింది. ఇది ప్రీపెయిడ్ రీఛార్జి రూ. 149 మరియు పైన అలాగే ఒక కొత్త ప్యాక్ అన్ని అపరిమిత సేవలతో రూ.1699 రూపాయల రీఛార్జి వార్షిక ప్రణాళికను గురువారం వెల్లడించింది. జీయో యొక్క క్యాష్ బ్యాక్ ఆఫర్ నవంబర్ 30, 2018 వరకూ చెల్లుతుంది మరియు ఈ ఆఫర్ సమయంలో అందుకున్న కూపన్లు డిసెంబర్ 31, 2018 న లోగ వాడుకోవాలి.
భారతి ఎయిర్టెల్
గత కొద్ది రోజుల క్రితం,టెలికాం సంస్థ అయిన భారతి ఎయిర్టెల్ ప్రీపెయిడ్ రీచార్జ్ ప్యాక్ల ద్వారా దాని ప్రీపెయిడ్ పోర్ట్ ఫోలియోను పునరుద్ధరించడానికి, రూ. 159, రూ. 181 మరియు రూ. 289 ప్యాక్లను అందుబాటులో ఉంచింది.
రీఛార్జి ప్యాక్ రూ. 398
గత వారం ఎయిర్టెల్ ప్రీపెయిడ్ రీఛార్జి రూ. 398 ప్లాన్ ను అనుబాటులో తెచ్చింది,ఈ ప్యాక్ లో అపరిమిత కాల్స్ మరియు రోజుకు 1.5 GB డేటాను అందిస్తుంది,అలాగే ఇతర ప్రయోజనాల తో సహా, 70 రోజుల మొత్తం చెల్లుబాటు వ్యవధి ఉంటుంది.