వరుసగా 11 వ రోజు పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు.
మంగళవారం అన్ని మెట్రో నగరాల్లో పెట్రోలు ధర లీటరుకు 11 పైసలు పెంచింది. డీజిల్ ధర 11 రోజులు వరుసగా పెరిగింది.
మంగళవారం అన్ని మెట్రో నగరాల్లో పెట్రోలు ధర లీటరుకు 11 పైసలు పెంచింది. డీజిల్ ధర 11 రోజులు వరుసగా పెరిగింది.మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలపై రూ. 2.50 చొప్పున తగ్గిస్తున్నట్టు ఇటీవలే పేర్కొంది.
అక్టోబరు 4 న ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం రూ. 1.5 రూపాయల తగ్గింపు ప్రకటించారు. ఇంధన ధరలపై మరో రూ.1 రూపాయి నష్టాన్ని భరించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్లను కోరారు. దీని తరువాత అనేక రాష్ట్రాల్లో అమ్మకపు పన్ను లేదా వేట్లలో రూ. 2.50 తగ్గింపు కొనసాగింది.
ముంబయిలో కూడా డీజిల్ ధరల పెరుగుదల నిరంతరం పెరుగుతోంది. ఇప్పటికే గతంలో ఉన్న రూ.80.10 రూపాయలకి దగ్గరగా ఉంది. ముంబైలో లీటరు డీజిల్ రూ. 79.35, చెన్నైలో రూ. 80.04, కోలకతాలో రూ. 77.54 రూపాయల ధరలు నమోదయ్యాయి.
అయితే పెట్రోలు ధరల పెంపుపై కాస్త నిలకడగా ఉంది. ఢిల్లీలో పెట్రోలు లీటరు రూ.82.83 రూపాయలు, ముంబయిలో రూ.88.29, చెన్నై రూ.86.10, కోల్కతాలో రూ. 84.65 రూపాయల ధరలు కొనసాగుతున్నాయి.
వరుసగా 11 వ రోజు పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి .
ఉత్తరప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలు రెండు ఇంధన ధరలలో పన్ను తగ్గించటంతో, పొరుగున ఉన్న ఢిల్లీ ప్రభుత్వానికి పన్ను తగ్గించాలనే ఒత్తిడి పెరిగింది. పెట్రోల్ మరియు డీజిల్ పొరుగున ఉన్న గుర్గావ్ లేదా గురుగ్రాం మరియు నోయిడా లో ధరలు చవకగా ఉన్నాయి.