2019 ఎన్నికలకు ఇప్పటినుండే సందడి మొదలైంది ఆంధ్రప్రదేశ్ లో అప్పుడే ఎన్నికల వాతావరణం నెలకొంది,అధికార విపక్ష పార్టీలు వరుస సభలతో హోరెత్తిస్తున్నాయి.
2019 ఎన్నికలకు ఇప్పటినుండే సందడి మొదలైంది ఆంధ్రప్రదేశ్ లో అప్పుడే ఎన్నికల వాతావరణం నెలకొంది,అధికార విపక్ష పార్టీలు వరుస సభలతో హోరెత్తిస్తున్నాయి. అధికార పార్టీ పలు పథకాలు ప్రవేశపెడుతూ ప్రజలను ఆకట్టుకునే పనిలో పడింది.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్న మొదటి కోరిక ప్రత్యేకహోదా.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే ప్రత్యేకహోదా పై తొలి సంతకం అని రాహుల్ ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్ర రాజకీయాల్లో వేడి మొదలైంది.2019 సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రీ మేనిఫెస్టో ను విడుదల చేసింది.

ఎఐసిసి అధ్యక్ష్య బాధ్యతలు:
రాహుల్ గాంధీ ఎఐసిసి అధ్యక్ష్య బాధ్యతలు చేపట్టినప్పట్నుండి దేశవ్యాప్తంగా విస్తృతంగా తిరుగుతూ మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ విపక్షాలన్నిటిని ఏకం చేస్తున్నాడు.అంతే కాకుండా పార్టీ తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక ద్రుష్టి పెట్టింది.ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కి పలు వరాల జల్లు కురిపించింది.
ఆంధ్రప్రదేశ్ కి ఇస్తున్న వరాలు ఇవే:

ప్రత్యేక హోదా:
యుపిఎ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మీద తొలి సంతకం చేస్తానంటూ రాహుల్ గాంధీ బహిరంగంగానే ప్రకటించాడు.సిడబ్ల్యుసి సమావేశం లో కూడా దీనిపై పార్టీ శ్రేణులందరితో ఏకపక్ష తీర్మానం చేయించిన విషయం విదితమే. రాష్ట్రము విడిపోయాక చట్టం లో పొందుపరిచిన విభజన హామీలన్నీ నెరవేస్తా అని ప్రకటించాడు.

వెనుకబడిన జిల్లలకు:
ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత వెనకబడిన జిల్లాలు ఉత్తరాంధ్ర మరియు రాయలసీమకు బున్దేల్ ఖండ్ తరహాలో ప్రయేక ప్యాకేజి అమలు చేస్తామని ప్రకటించారు .అలాగే రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సరిపడా నిధులు కేటాయిస్తామని అలాగే బడ్జెట్ లోటు భర్తీ చేస్తామని కూడా ప్రకటించారు.మెట్రో రైళ్లు,రహదారులు,గన్నవరం పోర్ట్,విశాఖ ఉక్కు కర్మాగారం,రైల్వే జోన్ వంటి అంశాలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

నాలుగు వంట సీలిండర్లు ఉచితం:
ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా సంఘాలకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు అలాగే ప్రతి పేదకుటుంబానికి సంవత్సరానికి నాలుగు వంట సీలిండర్లను ప్రబుత్వం సబ్సిడీ కింద పూర్తిగా ఉచితంగా ఇస్తామని ప్రకటించింది.

పింఛన్ పథకం:
వృద్దులు,వితంతువులు ,ఒంటరి మహిళలకు పింఛన్లు,50 సంవత్సరాల నుండి 60 లోపు వారికి రూ.2000 రూపాయలు,60 నుండి 70 సంవత్సరాలలోపు ఉన్నవారికి రూ.25000 రూపాయలు అలాగే 70 ఏళ్ళు పైబడిన వారికి రూ.3000 మరియు వికలాంగులకు కూడా రూ.3000 రూపాయలు పింఛను ఇస్తామని ప్రకటించింది.

తెల్ల కార్డు అర్హులకు:
రాష్ట్రము లో తెల్ల కార్డు అర్హులందరికీ సన్న బియ్యం అలాగే అమ్మహస్తం పేరు మీద ప్రతి నెల 9 రకాలైన నిత్యవసర సరుకులను అందించనుంది.ఈ పథకం పండుగలతో సంబంధం లేకుండా ప్రతి నెల మీకు సంబందించిన ప్రభుత్వ స్టోర్ లో వీటిని పొందవచ్చు.

ప్రతి ఇంటికి:
రాష్ట్రవ్యాప్తంగా చాల ప్రాంతాల్లో మంచి నీరు కొరతతో ప్రజలు చాల అవస్థలు పడుతున్నారు,తాము అధికారం లోకి వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి మంచి నీటి కుళాయి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

ఆరోగ్య శ్రీ పథకం:
గతం లో కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉన్నపుడు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం అమల్లోకి వచ్చింది దీనితో చాలా మంది పేద ప్రజలు ఉచిత వైద్యం అందుకున్నారు.ఇదే తరహాలో రానున్న 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ పథకం కింద రూ.2 నుండి రూ.5 లక్షల వరకు పెంచనున్నారు.

బీజేపీ ప్రభుత్వం:
గత 2014 ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వం తాము అధికారం లోకి వచ్చిన వెంటనే ఆంధ్ర కి ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చారు.కానీ ఎన్నికల్లో గెలిచిన తరువాత హామీని గంగలో కలిపేశారు.14 వ ఆర్థిక సంగం ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకహోదా ఇవ్వడం కుదరదని చెప్పిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్ల్య్ వెల్లడించారు.దింతో ప్రజలు బీజేపీ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications