కేంద్రం రైల్వే ఉద్యోగులకి దసరా తీపి కబురు! ఉద్యోగులకి పండగే.
రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు 78 రోజుల దసరా బోనస్ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రైల్వే యూనియన్లతో చర్చల అనంతరం ఉత్పాదకత ఆధారంగా ఇచ్చే పీఎల్బీ బోన్సను ఈ ఏడాది కూడా 78 రోజులకే ఇవ్వాలని రైల్వే బోర్డు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో రైల్వేశాఖలో పనిచేసే సుమారు 12.26 లక్షల మంది ఉద్యోగులకు దాదాపు రూ.18 వేల చొప్పున బోనస్ లభించనుంది. ఇది నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు మాత్రమే వర్తించనుంది. గెజిటెడ్ ఉద్యోగులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్కు చెందిన ఉద్యోగులకు ఈ బోనస్ వర్తించదు.

రైల్వేశాఖ గత సంవత్సరం ఆదాయం కంటే ఈ సారి రూ.16 వేల కోట్ల రూపాయలు ఎక్కువుగా సంపాదించింది, ఇక 1,161 మిలియన్ టన్నుల రవాణా సరుకును రవాణా చేసింది . 80 రోజుల బోనస్ డిమాండ్ చేశామని భారత రైల్వేమెన్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ జనరల్ సెక్రటరీ ఎం.రాఘవయ్య చెప్పారు. చివరకు, 78 రోజుల బోనస్ అంగీకరించారు.ఇక ఒక్కోకో ఉద్యోగికి రూ.18 వేలు బోనస్ వస్తుంది.
దసరా పండుగ కారణంగా ఉద్యోగులు బోనస్ ఆశిస్తారు అని కనుక 78 రోజుల బోనస్ ఇస్తున్నాము ప్రకటించారు. PLB ఒక ప్రోత్సాహకంగా పనిచేస్తుందని రైల్వే శాఖ చెబుతోంది. పెద్ద సంఖ్యలో ఉద్యోగులను, ప్రత్యేకించి ఆపరేషన్లలో పాల్గొన్నవారికి వారి ఉత్పాదకత మెరుగుపరచడానికి మరియు వినియోగదారులకు భద్రత, వేగము మరియు సేవలను అందించేలా ప్రోత్సహిస్తుంది చూడాలి ఇంకా ఎన్ని కేంద్ర ఉద్యోగాల శాఖలకు దసరా కానుకగా వారికీ బోనస్ పెంచుతారో చూడాలి.


Click it and Unblock the Notifications