మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు వివిధ నగరాలలో పెట్రోల్ మరియు డీజీల్ ధరలు ఇలా ఉన్నాయి.
పెట్రోల్ ధర ముంబైలో మళ్లీ పెరిగింది. నిన్న గాక మొన్ననే కేంద్రం పెట్రోలుపై ఎక్సైజ్ సుంకాన్ని రూపాయిన్నర తగ్గించింది. ఆయిల్ కంపెనీలు మరో రూపాయి తగ్గించడంతో లీటరుపై రూ. 2.5 తగ్గించినట్లయింది. రాష్ట్రాలు కూడా ఇదే తరహాలో తగ్గించాలని కేంద్రం సూచించింది. ఆ రిలీఫ్ ను ప్రజలు ఆస్వాదించేలోపే ధరలు మళ్లీ పెరిగాయి.
ముంబైలో పెట్రోలుపై 18 పైసలు పెరిగింది. దీంతో అక్కడ లీటరు పెట్రోలు రూ87.15 కు చేరుకుంది. ఇక డీజిల్ 70 పైసలు తగ్గి 76.75 గా నమోదైంది. ఇక ఢిల్లీలో కూడా పెట్రోలుపై 18 పైసలు పెరిగి రూ. 81.68కు చేరుకోగా డీజిల్ మీద 29 పైసలు పెరిగి రూ. 73.24 గా నమోదైంది.
ముంబయిలోనూ లీటర్ పెట్రోలు ధర 18 పైసలు పెరిగి రూ.87.15 గా నమోదైంది. డీజిల్ ధర మాత్రం 70 పైసలు తగ్గడం విశేషం. దీంతో అక్కడ లీటరు డీజిల్ ధర రూ.76.75కి పడిపోయింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.86.59, డీజిల్ ధర రూ.79.67గా ఉంది.
ఇప్పుడు లీటరు పెట్రోల్ ధర రూ. 83.52 (రూ. 2.28 తగ్గింపు) కాగా డీజిల్ 75.09 (రూ. 2.21 తగ్గింపు) పలుకుతోంది.
అక్టోబరు 6న దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు:
పెట్రోలు ధర (లీటర్) డీజిల్ ధర (లీటర్)
- ఢిల్లీ రూ.81.68 రూ.73.24
- ముంబయి రూ.87.15 రూ.76.75
- కోల్కతా రూ.83.52 రూ.75.09
- చెన్నై రూ. 84.89 రూ.77.42
- బెంగళూరు రూ.82.32 రూ.73.61
- హైదరాబాద్ రూ.86.59 రూ.79.67
- విజయవాడ రూ.85.66 రూ.78.41
- అహ్మదాబాద్ రూ.78.67 రూ.76.54
- లక్నో రూ.79.12 రూ.71.28