మమతా బెనర్జీ కి భారీ షాక్ ఇచ్చిన కోల్కతా హైకోర్టు. రూ.28 కోట్లు నిలిపివేత?
కలకత్తా హైకోర్టు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యొక్క దుర్గా పూజ ప్రణాళికను తాత్కాలికంగా నిలిపివేసింది.మమతా బెనర్జీ రాష్ట్రంలో ప్రతి పూజకు రూ.10,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణఇంచింది.
కొల్కతా: కలకత్తా హైకోర్టు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యొక్క దుర్గా పూజ ప్రణాళికను తాత్కాలికంగా నిలిపివేసింది.మమతా బెనర్జీ రాష్ట్రంలో ప్రతి పూజకు రూ.10,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణఇంచింది. రాష్ట్ర ప్రభుత్వం మతపరమైన ప్రయోజనాల కోసం ప్రజా ధనాన్ని ఎలా ఉపయోగిస్తారని కోర్టుకు పిటిషనర్ కోరారు.
మతపరమైన ప్రయోజనాలు
రాష్ట్రంలో ఒక ప్రత్యేక విభాగం మతపరమైన ప్రయోజనాల కోసం నిధులు సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది,ఇది మన రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్ణయాలకు విరుద్ధంగా అమలు అవుతోందని వామపక్ష పార్టీ ఆర్ఎస్పికు అనుబంధంగా ఉన్న యునైటెడ్ ట్రెండ్స్ యూనియన్ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది.
బెంగాల్ ప్రభుత్వం
బెంగాల్ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని కోల్కతాలో 3000 పూజలకు మరియు జిల్లాల్లో 25,000 పూజలు నిర్వహించడానికి రూ.28 కోట్లు కేటాయించింది.
హైకోర్టు
హైకోర్టు మంగళవారం వరకు పూజ నిర్వాహకులకు ఎటువంటి డబ్బు ఇవ్వకూడదని ఉత్తర్వులు జారీచేసింది న్యాస్థానం లో పలు ప్రశ్నలపై విచారణ జరిగేదాకా ఎటువంటి డబ్బు పంపిణి చేయకూడదని పేర్కొంది.ప్రజల డబ్బును వినియోగించే దానిలో ఉద్దేశ్యం ఏమిటి? మీరు దానిని ఉపయోగించవచ్చా? డబ్బు పంపిణీ చేయడానికి మార్గదర్శకం ఉందా? అన్ని మతాల ప్రతి ప్రధాన పండుగకు మీరు అదే మొత్తాన్ని ఇచ్చారా?" అని కోర్టు ప్రశ్నలు సంధించింది.
సేఫ్ డ్రైవ్ సేవ్ లైఫ్
ముఖ్యమంత్రి 'సేఫ్ డ్రైవ్ సేవ్ లైఫ్' ప్రచారాన్ని హైలైట్ చేయడానికి డబ్బును రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించే నిర్ణయాన్ని తీసుకుందని సమర్థించుకునే ప్రయత్నం చేసింది.కానీ దానికి కోర్టు ఇలా చెప్పింది,ప్రభుత్వం ఎందుకు ఈ ప్రచారాన్ని పూజల పేరుతో చేస్తున్నారు అని ప్రశ్నించింది.
దుర్గా పూజకు
బెంగాల్ బిజెపి చీఫ్ దిలీప్ ఘోష్ మర్లాడుతూ శ్రీమతి బెనర్జీ మతపరమైన రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. దుర్గా పూజకు 'చందా' (సహకారం) ఇవ్వడం బుజ్జగింపు రాజకీయాలు అని ఇంతకు ముందు ఇమామ్ స్టిపెండ్, ప్రస్తుతం దుర్గా పూజ రాష్ట్ర ప్రభుత్వం చాల సార్లు ఫిర్యాదు చేసింది పండుగలు నిర్వహించడానికి ప్రభుత్వం యాహూ నిధులు సరిపడా లేవని కానీ ఇప్పుడు కేవలం దుర్గ పూజకు మాత్రమే రూ.28 కోట్లు ఎలా కేటాయించారని ఘోష్ అన్నారు.
ర్యాలీ నిర్వహణ
మమతా బెనర్జీ తీసుకున్న దుర్గ పూజ నిర్ణయాన్ని నిరసిస్తూ ఇమామ్లు కోల్కతాలో ర్యాలీని నిర్వహించిన రెండు రోజుల తరువాత కోర్టు ఉత్తర్వులు జారీచేయబడ్డాయి. పిర్జాదా తహా సిద్దిఖీ ముఖ్యమంత్రిపై ఆరోపణ చేస్తూ, మమతా బెనర్జీ పూజలకు డబ్బు ఇవ్వడంతో ఆయనకు ఎలాంటి సమస్య లేదు, కానీ ఆమె "ఇతర సమాజాలకు కూడా ఇదే విదంగా చేయాలనీ కోరారు." ర్యాలీ నిరసనలో ఇంకొంతమంది మాట్లాడుతూ,పాడైపోయిన ఫ్లై ఓవర్లను మరియు బ్రిడ్జిలను రిపేర్ చేయడానికి డబ్బు ఖర్చు పెట్టాలని పేర్కొన్నారు. బెహాలా సమీపంలోని మజెర్హత్ వంతెన కూలిపోయిన తర్వాత, ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోపాన్ని ఎదుర్కొంది.