మహారాష్ట్రలో పెట్రోల్ అతి తక్కువ ధర.మనకు కూడా అదే ధర లభించనుందా?
మహారాష్ట్ర ప్రభుత్వం పెట్రోలుపై వ్యాట్ తగ్గించిన ఒకరోజు తరువాత శుక్రవారం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ డీజిల్ పై ధరలను లీటరుకు రూ.4.06 రూపాయల చొప్పున తగ్గింపు ప్రకటించారు.
మహారాష్ట్ర ప్రభుత్వం పెట్రోలుపై వ్యాట్ తగ్గించిన ఒకరోజు తరువాత శుక్రవారం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ డీజిల్ పై ధరలను లీటరుకు రూ.4.06 రూపాయల చొప్పున తగ్గింపు ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం
డీజిల్ పై లీటరుకు రూ .2.50 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కలిపించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పన్నుల ద్వారా లీటరుకు రూ .1.56 రూపాయలు తగ్గించి మరింత ఉపశమనం ఇవ్వాలని నిర్ణయించింది.ప్రస్తుతం సమర్థవంతమైన తగ్గింపు లీటరుకు RS.4.06 రూపాయలు ఉంటుంది.
పెట్రోల్ పై వాల్యూ యాడెడ్ టాక్స్ (వాట్) తగ్గించాలన్న ప్రభుత్వ నిర్ణయం లీటరు రూ. 2.50 రూపాయలను ప్రజలు చాలా మంది స్వాగతించారు, ప్రభుత్వం పెద్ద మొత్తం లో ప్రజా ప్రయోజనంకోసం నష్టాలను భరించింది.
మహారాష్ట్ర ప్రభుత్వం
కేంద్రం గురువారం పెట్రోల్ మరియు డీజిల్ పై వ్యాట్ ను తగ్గిస్తున్నట్టు ప్రకటన చేసిన వెంటనే మహారాష్ట్ర కూడా రాష్ట్ర పరిధిలో కొంత వ్యాట్ ను తగ్గించాలని నిర్ణఇంచింది ఇదే తరహాలో మరో పన్నెండు రాష్ట్రాలు కూడా ఇదే విధానాన్ని అనుసరించాయి.
అయినప్పటికీ, మహారాష్ట్ర పెట్రోల్ పై మాత్రమే వేట్ను తగ్గించింది, ఇది ధనిక వర్గాల ప్రజల ఆసక్తులపై పనిచేస్తుందని విమర్శలను ఎదురుకొంది.
సమిష్టిగా ధర తగ్గింపు
రాష్ట్రం మరియు కేంద్ర నిర్ణయం సమిష్టిగా పెట్రోల్, డీజిల్ ధర తగ్గింపులీటర్పై రూ. 4.37 రూపాయలు, తగ్గించిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుండి అమల్లో ఉంటుంది.దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కన్నా మహారాష్ట్రలో అధిక మొత్తం లో ధర తగ్గింపు ఉంది.
అశోక్ చవాన్
మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ చవాన్ మాట్లాడుతూ,ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన ప్రకారం లీటర్ పై రూ.5 రూపాయలు తగ్గిస్తా అని చెప్పాడు కానీ శుక్రవారం ఉదయం అమల్లోకొచ్చిన ధరలపై రూ.4 .37 రూపాయలు మాత్రమే తగ్గిందని విమర్శించారు.
జిఎస్టి కింద అమలు
ఇది తీవ్రమైన మోసం, లీటరుకు 5 రూపాయలు తగ్గింపు ప్రకటించిన తర్వాత, అది కేవలం రూ.4.37 రూపాయలకు మాత్రమే తగ్గింపు జరిగిందని ... ఇది రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకం అని ఐతే తక్షమే రెండు పెట్రోల్-డీజిల్ ధరలను జిఎస్టి కింద అమలు పరచాలని చవాన్ చెప్పారు.
ధనంజయ్ ముండే
శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు ధనంజయ్ ముండే ఆలస్యమైన నిర్ణయాన్ని విమర్శించారు. ప్రజలకు నిజమైన ఉపశమనం కలిపించాలంటే పెట్రోల్-డీజిల్ను GST కింద తీసుకురావాలని పునరుద్ఘాటించారు.
ముడి చమురు ధర
అయితే, ఆల్ మహారాష్ట్ర పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ (FAMPEDA) సమాఖ్య, ఉదయ్ లోధ్ మాట్లాడుతూ తగ్గింపులను స్వాగతించే సమయంలో, చమురు మార్కెటింగ్ కంపెనీల రోజువారీ ధరల పెరుగుదల అంతర్జాతీయ ముడి చమురు ధర హెచ్చుతగ్గులు ప్రకారం కొనసాగుతుందని సూచించారు.