దేశంలో సంచలనం విత్తనాలతో పెట్రోల్ తయారి..లీటర్ పెట్రోల్ ధర ఎంతో తెలుసా?
దేశంలో సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్న పెట్రోల్ ధరలు రోజురోజుకు ఇంకా పెరుగుతూ పోతున్నాయి తప్ప తగ్గడం లేదు. త్వరలోనే మన దేశంలో పెట్రోల్ లీటర్ ధర రూ.100 దాటినా మనము ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
సామాన్యుడు
కానీ ఈ విషయంలో సామాన్యుడు లోలోపల భగ్గుమంటున్నాడు ఇన్ని రోజుల్లో ఇంటికి, సామాన్లకి, సరుకులకు అప్పులు చేసిన సామాన్యుడు ఇప్పుడు పెట్రోల్ కొనడానికి అప్పులు చేస్తున్నాడు అంటే మీరే చూడండి పరిస్థితి ఎలా ఉందొ.ఇలాంటి సందర్భంలో పెట్రోల్ ధరలు తగ్గుతున్నాయి అంటే చాలు ఎప్పుడు తగ్గుతున్నాయి ఎంత తగ్గుతున్నాయి అని అడుగుతారు.
ఇక పెట్రోల్ రేట్ తగ్గించడానికి ఒక కిటుకు ఉంది అది ఏంటో తెలుసుకుందామా!
మన దేశంలో గ్యాస్ నిలువలు చాలా తక్కువ ఉన్నాయి అంటే మొత్తం ప్రపంచ నిలువలలో మన వాటా 0 .6 శాతం మాత్రమే. ఈ లెక్కన ప్రస్తుతం ప్రతి రోజు 194 మిలియన్ క్యూబిక్ మీటర్ల చెప్పున వినియోగాన్ని పరిగణలోకి తీసుకున్న కూడా 25 ఏళ్లకు మించి గ్యాస్ నిలువలు ఉండవు. అందుకే మనం ప్రతి ఏటా 30 శాతం గ్యాస్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము.
విదేశాల నుంచి
ఒక పక్క ఆయిల్ గ్యాస్ నిలువలు తరిగిపోతుండడం మరో పక్క గ్యాస్ మరియు పెట్రోల్ వినియోగం పెరుగుతుండడంతో దిగుమతులు పెరుగుతుండడంతో ఆందోళన కలగచేస్తోంది.అందుకే మనం ప్రతి ఏటా విదేశాల నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవడం తప్పడం లేదు. దింతో దేశం కూడా ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడుతోంది. ఇలా బాధపడే బదులు మన దగ్గర ఉన్న నిక్షేపాలతో కూడా మనం వినియోగించుకోవాచు కదా అప్పుడు ఈ దిగుమతులు తగ్గుతాయి అని సందేహం రావచ్చు.
మొక్కల నుంచి
ఇలా పెట్రోల్ రేట్లకు నడ్డి విరగకొట్టుకుంటున్న సామాన్యుడి చూపు సహజ ఇంధనం మధ్య మార్గంగా కన్పిస్తోంది. మొక్కలు మరియు జంతువుల కళేబరాలు నుంచి సేకరించే ఇంధనం సహజ ఇంధనం అని అంటారు. ఈ సహజ ఇంధనం ఉత్పత్తి పెంచే భాగంలో 2003 లో చత్తిస్గడ్ ముఖ్యమంత్రి అజిత్ జోగి బయో ఫ్యూయల్స్ ఉత్పత్తి పై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. జాస్త్రోఫా మరియు హొంగామియా మొక్కల నుంచి డీజిల్ తయారు చేయడం చెరుకు నుంచి ఇథనాల్ ను 10 శాతం పెట్రోల్ లో బ్లెండెడ్ గా కలపడం మొదలు పెట్టారు.
టాటా జిందాల్
ఇక 2009 లో అంతగా నాణ్యత లేని బొగ్గు ద్వారా డీసెల్ మరియు కిరోసిన్ ఉత్పత్తి ముమ్మరం చేశారు. ఈ టెక్నాలజీ తో ఒరిస్సా రాష్ట్రంలో టాటా జిందాల్ కంపెనీలు 2016 నుంచి ఉత్పత్తి చేయడానికి సిద్దమయ్యాయి. అయితే ఇప్పుడు ఆశ్చర్యకరంగా బయో డీజీల్ తయారీకి ఎంతో ఉపయోగమైన జాస్త్రోఫా మరియు హొంగామియా మొక్కలు మన దేశ బంజరు భూములలో విచ్చలివిడిగా పెరుగుతోంది.
మన అదృష్టం
మన అదృష్టం బాగుండో మన పెట్రో కష్టాలని దేవుడు గుర్తించాడో ఎమ్మో కానీ మన దేశ వాతావరణం ఈ మొక్క పెరుగుదలకు సరిగ్గా సరిపోయాయి. నిజానికి 13 ఏళ్ల క్రితమే విలాస్పూర్ దగ్గర ఈ మొక్కలను పెంచడం మొదలు పెట్టారు అయితే ఈ మొక్కలకు ఇక్కడి వాతావరణానికి తట్టుకొనే శక్తి వచ్చింది. ఇప్పుడు ఈ మొక్కను రైతులు పండించడం మొదలు పెడితే ఇంధన స్వాతంత్రం తెచ్చుకోవడం పెద్ద కష్టం కాదు.
రాయలసీమ
ఇప్పటికే ఈ మొక్కల నుంచి తీసిన ఇంధనంతో డెహ్రడూన్ నుంచి ఢిల్లీ వరకు సక్సెస్ గా ప్రయాణించింది. ఈ మొక్కలు మన దేశ వాతావరణం తట్టుకొనే పెరుగుతాయి. ఇక మన తెలుగు రాష్ట్రాలలో రాయలసీమ వంటి ప్రాంతాలలో ఈ మొక్క సాగు బాగా వస్తుంది. ఈ మొక్కల పెంపకం వల్ల భూమి కోతకి గురి కాకుండా చూసుకోవచ్చు. అంత బాగుంటే మన దేశంలో ఈ మొక్కల వల్ల లీటర్ పెట్రోల్ రూ.25 కే కొనవచ్చు.