బుధవారం ఉదయం ట్రేడింగ్లో డాలర్ తో పోల్చుకుంటే రూపాయి 43 పైసలు క్షీణించి 73.34 వద్ద ముగిసింది. గత రెండు సెషన్లలో గ్లోబల్ క్రూడాయిల్ ధరల పెరుగుదల స్థానిక యూనిట్కు సెంటిమెంట్ను బలపరిచింది.
బుధవారం ఉదయం ట్రేడింగ్లో డాలర్ తో పోల్చుకుంటే రూపాయి 43 పైసలు క్షీణించి 73.34 వద్ద ముగిసింది. గత రెండు సెషన్లలో గ్లోబల్ క్రూడాయిల్ ధరల పెరుగుదల స్థానిక యూనిట్కు సెంటిమెంట్ను బలపరిచింది. క్రూడ్ ధరలు పెరగడం వల్ల ద్రవ్యలోటు కట్టు తప్పు జరగొచ్చని ట్రేడర్లు ఆందోళనలు వ్యక్తంచేశారు. దీంతో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 73.26 వద్ద ముగిసింది. సోమవారం నాడు 72.91 వద్ద ముగిసింది. గాంధీ జయంతి కారణంగా మంగళవారం నాడు ఫారెక్స్ మార్కెట్లు సెలవు.

అమెరికాలో క్రూడ్ ఉత్పత్తి తగ్గడం, వెనిజులలో ఉత్పత్తి నెమ్మదించడం, ఇరాన్పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో గ్లోబల్గా క్రూడ్ సరఫరా తగ్గడం వల్ల సమీప కాలంలో క్రూడ్ ధరలు బాగా పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేశారు.భారత్లో పదేళ్ల బాండ్ ఈల్డ్ 8.052 శాతంగా ఉంది. ఇక బాండ్ ఈల్డ్ మునపటి ముగింపు స్థాయి 7.988 శాతంగా ఉంది. బాండ్ ఈల్డ్స్, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి.
బెంచ్మార్క్ సెన్సెక్స్ ఇండెక్స్ ఈ ఏడాది ఇప్పటి దాకా 7.25 శాతంమేర పెరిగింది.
ఆసియా ప్రధాన కరెన్సీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఇండోనేసియా రుపియ 0.27 శాతం, జపాన్ యెన్ 0.13 శాతం, తైవాన్ డాలర్ 0.07 శాతం క్షీణించాయి.విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) సోమవారం రూ. 1,842 కోట్లు, తాత్కాలిక షేర్లను విక్రయించినట్టు డేటా చూపించింది.
5. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) సోమవారం నాడు అక్టోబర్ లోరూ.36,000 కోట్ల రూపాయల ధనాన్ని మార్కెట్లో పెట్టుబడులు పెట్టనుంది, ఆర్ధికవ్యవస్థ ద్వారా క్రెడిట్ క్రంచ్ భయాందోళనలకు గురవుతుందని భావించి ప్రభుత్వ బాండ్లను తిరిగి కొనడానికి ప్రతిస్పందించింది.


Click it and Unblock the Notifications