మరోసారి పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధరలు.
సబ్సిడైజ్డ్ వంట గ్యాస్ (ఎల్పిజి సిలిండర్)14.2 కిలోల సిలిండర్ పై ధర రూ.2.98 రూపాయల చొప్పున ఢిల్లీలో రూ .499.51 నుంచి 502.4 రూపాయలకు పెరిగింది.
సబ్సిడైజ్డ్ వంట గ్యాస్ (ఎల్పిజి సిలిండర్)14.2 కిలోల సిలిండర్ పై ధర రూ.2.98 రూపాయల చొప్పున ఢిల్లీలో రూ .499.51 నుంచి 502.4 రూపాయలకు పెరిగింది.పెరిగిన ధరలు 1 అక్టోబర్ నుండి అమలులో ఉంటాయి మరియు అదే విదంగా ఇతర చిన్న నగరాల్లో అలాగే మెట్రో నగరాల్లో కూడా రేట్లు పెరిగాయి.
ఢిల్లీలో నాన్-సబ్సిడైజ్డ్ దేశీయ 14.2 కిలోల సిలిండర్ల పై ధరలు రూ.59 రూపాయల చొప్పున పెరిగాయి. భారతదేశంలో గృహాలు సబ్సిడీ రేట్ కు కనీసం 12 సిలెండర్లను కొనుగోలు చేయడానికి అనుమతించారు,తర్వాత వారు పూర్తి ధర చెల్లించి కొనుగోలు చేయాలి.
కొత్తగా వర్తించే ధరల గురించి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) ప్రకటించిన ప్రకటనలో అంతర్జాతీయ ధరలు, విదేశీ మారక విలువలు పెరగడంతో ధరల పెరుగుదల గణనీయంగా ఉందని తెలిపింది.ఢిల్లీలో నాన్ సబ్సిడైజ్డ్ ఎల్పిజి ధర అక్టోబర్ 2018 నాటికి సిలిండర్కు రూ .59.00 పెంచనుంది.
ప్రధానంగా అంతర్జాతీయ ధరల మార్పు మరియు విదేశీ మారక ద్రవ్యం మార్పుల కారణంగా, సబ్సిడైజ్డ్ దేశీయ ఎల్పిజి వినియోగదారులపై వాస్తవ ప్రభావం కేవలం సిలిండర్కు రూ .2.89 మాత్రమే అదికూడా పైన పేర్కొన్న GST కారణంగా ధరలు కాస్త పెరిగాయని తెలిపింది.
నిష్పత్తిలో ఉన్న అర్హత కలిగిన వినియోగదారుల బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం అందించే సబ్సిడీ మొత్తం లో కూడా పెరుగుతుందని కూడా గమనించాలి. సెప్టెంబరులో సిలిండర్కు 320.49 రూపాయల నుంచి 2018 అక్టోబర్ లో వినియోగదారుల బ్యాంకు ఖాతాలో సబ్సిడీ బదిలీకి రూ .376.60 చొప్పున పెరిగింది. అందువల్ల దేశీయ సబ్సిడీ గల ఎల్పిజి కస్టమర్ ఎల్పిజి ధరల పెరుగుదల నుండి రక్షణ కల్పిస్తోంది అని ప్రకటనలో తెలిపింది.