ముంబైలో 91 రూపాయల చొప్పున లీటర్ పెట్రోలు ధరలు పెరిగాయి.ముంబైలో ఆదివారం రూ.90.84 రూపాయల నుండి పెరిగి ప్రస్తుతం లీటరుకు రూ.91.08 ధరకు విక్రయిస్తోంది
ముంబైలో 91 రూపాయల చొప్పున లీటర్ పెట్రోలు ధరలు పెరిగాయి.ముంబైలో ఆదివారం రూ.90.84 రూపాయల నుండి పెరిగి ప్రస్తుతం లీటరుకు రూ.91.08 ధరకు విక్రయిస్తోంది అలాగే ముంబయిలో డీజిల్ ధర రూ.0.32 రూపాయలు పెరిగి, లీటరుకు 79.72 రూపాయలు ధర నమోదయినది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.83.73 రూపాయలు, డీజిల్ ధర రూ.75.09 రూపాయల వద్ద రిటైలింగ్ అవుతోంది.

ఇతర నగరాల్లో దరలు
ఇతర నగరాల్లో పెట్రోలు దరల విషయానికొస్తే, బెంగళూరులో రూ.84.40 రూపాయలు, కోల్కతాలో రూ.85.53 రూపాయలు, చెన్నైలో రూ.87.05 రూపాయలు, లక్నోలో రూ.83.03 రూపాయలు ఉన్నాయి అలాగే డీజిల్ ధర బెంగళూరు లో రూ.75.48 కోల్కతాలో రూ .76.94, చెన్నైలో రూ .79.40 , లక్నోలో రూ. 75.22 రూపాయలుగా ఉన్నాయని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఒసి) పేర్కొంది.

స్థానిక వ్యాట్
ధరలు స్థానిక వ్యాట్ రేట్లు ప్రకారం మారుతూ ఉంటాయి. తక్కువ పన్నులు కారణంగా ఢిల్లీలో చౌకగా ఇంధన ధరలు ఉన్నాయి. మరోవైపు ముంబైలో అత్యధిక పన్ను కారణంగా ధర ఎక్కువ ఉంది. మహారాష్ట్రలో పెట్రోల్ పై 25 శాతం విలువ-ఆధారిత పన్ను (వ్యాట్), రాష్ట్ర వ్యాప్తంగా లీటర్కు 9 రూపాయలకు అదనంగా ఉంది. డీజిల్ పై, వ్యాట్ 21 శాతం ముంబయిలో ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా లీటర్కు 1 రూపాయి సర్ఛార్జ్ ఉంది. గత కొద్ది రోజులుగా మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో లీటరు పెట్రోలు రూ.90 రూపాయలకు పైగా విక్రయం జరుగుతోంది.

ముడి చమురు ధరలు
ఇంధన ధరలు పెరగడంతో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ చమురు ధర గత వారం బ్యారెల్ కు $ 80 దాటింది, ఇది బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం, నేడు బ్యారెల్కు 83.21 డాలర్లు విక్రయిస్తోంది. బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్ మార్క్ 100 డాలర్లు తాకే అవకాశం ఉందని ఎనర్జీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పలు రాష్ట్రాలు:
సామాన్యుడిపై భారాన్ని తగ్గించే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్, కర్నాటక, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాలు ఇంధన ధరలను తగ్గించాయి. విదేశీ మారకపు ఒడిదుడుకుల వల్ల, ఢిల్లీలో నాన్-సబ్సిడైజ్డ్ LPG సిలిండర్ ధర రూ. 59 చొప్పున పెరిగింది.. కొత్త ధరలు నేడు నుండి అమలులోకి వచ్చాయి. సబ్సిడైజ్డ్ వంట గ్యాస్ ధర కూడా సిలిండర్కు రూ.2.89 రూపాయల చొప్పున పెరిగి రూ .502.4 కు చేరింది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications