జనసేన మేనిఫెస్టో విడుదల?ప్రజలపై కురిపించిన వరాలు అద్భుతం అని అనాలా?

పవన్ కళ్యాణ్ జనసేన రాజకీయ పార్టీ పెట్టి ప్రజాక్షేత్రంలోకి వచ్చాడు. అయితే 2019 ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు రెడీ చేసుకుంటున్నాయి. అయితే ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది.

జనసేన అధినేత

జనసేన అధినేత

ఇక జనసేన అధినేత ప్రజలకు అందిస్తున్న మేనిఫెస్టో చూద్దామా. తాజాగా దివ్యంగులకి ఒక్కొక్కరికి రూ.10 వేల రూపాయిలు పిన్షన్ ఇస్తాము అని ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఏలూరు లో దివ్యంగా సంఘాల ప్రతినిధులతో కలిసిన పవన్ కళ్యాణ్ తను చిన్నప్పటి నుంచి దివ్యంగులని చూస్తే చేలించి పోయేవాడిని అని అందుకే 20 ఏళ్ల వయస్సులో వారి కష్టాలపై ఒక డాక్యూమెంటరీ తీసాను అని చెప్పారు.

పెన్షన్

పెన్షన్

ఇంతటితో ఆగకుండా రేజర్వేషన్లు, ప్రత్యేక కార్పోరేషన్, హాస్టలు, ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు, మరియు హెల్త్ కార్డులు ఇలా ప్రజల పై వరాల జల్లు కురిపించాడు. ఇక ఆ తర్వాత పెన్షన్ గురించి చెప్పారు సామజిక పెన్షన్ రూ.5 వేలకి పెంచాలి అని దివ్యంగులు కోరగా జనసేన అధికారంలోకి వస్తే రూ.10 ఇస్తాము అని పవన్ కళ్యాణ్ చెప్పారు.

 రేషన్

రేషన్

హామీల విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఏ వర్గాన్ని వదిలిపెట్టడం లేదు . తమ డిమాండ్లు విలపించాడు వెళ్లిన వారు కూడా ఆశ్చర్యపోయేలా అయన హామీలు ఉంటున్నాయి అని సమాచారం. ఇక రేషన్ బదులు నేరుగా అకౌంట్ లోకి డబ్బులు వచ్చేలాగా చేస్తాం అని అంటున్నారు.

మ్యానిఫెస్టో

మ్యానిఫెస్టో

మ్యానిఫెస్టో తయారీ ముందు వరకు అన్ని చూసుకొని హామీలు ఇస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కనివిని ఎరుగని రీతిలో సాధ్యపడుతుందా లేదా అని ఆలోచించకుండా హామీలు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్.

యువత మొత్తం

యువత మొత్తం

2019 ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కనుక ప్రతి రాజకీయ పార్టీ ప్రజలను ఆకర్షించేకి ఎన్నో రకాల పధకాలు మరియు వరాలతో వస్తారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో యువత మొత్తం పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు చూడాలి 2019 ఎన్నికలకి ఏమి జరుగుతుందో.

జనసేన కవాతు:

జనసేన కవాతు:

నాలుగు రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో జెనసేన పేరుతో కవాతు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ కవాతు ముఖ్య ఉద్దెశం వ్యవస్థ లో నేలుకొన్న అవినీతిని నిర్ములించేందుకు అని అన్నారు.ప్రస్తుతం రాజకీయాలు కుళ్ళు పట్టాయని వాటిని వెంటనే ప్రక్షాళన చేసి అవినీతి రహిత పాలన రావాలన్నారు.

పార్టీలను ఏకిపారేసాడు:

పార్టీలను ఏకిపారేసాడు:

పలు సందర్భాల్లో మాట్లాడుతూ అధికార ప్రతిపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డాడు.అధికార పార్టీ పై పదునయినా విమర్శలు సంధించాడు 2014 లో తన మద్దతు తోనే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందని పదే పదే గుర్తుచేశాడు మరోవైపు ప్రతిపక్ష నేత జగన్ పై కూడా విమర్శలు గుప్పించాడు రాజకీయం అంటే వారసత్వం కాదని చురకలు వేసాడు.

పవన్ పై విమర్శలు:

పవన్ పై విమర్శలు:

పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై అధికార పార్టీ నాయకులూ తీవ్రంగా మండిపడ్డారు,అసలు పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదని బిజెపి రాసిచ్చిన స్క్రిప్ట్ చదుతున్నదని అసలు తాను మాట్లాడే ప్రతి మాటకు సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడేస్తున్నాడని అన్నారు.జనసేన కవాతు కు సుమారు రూ.38 కోట్లు ఖర్చు పెట్టారని ఈ డబ్బు తనకు ఎవరు సమకూర్చారో వెంటనే సంవాదం చెప్పాలని కూడా వారు డిమాండ్ చేసారు.

టిట్లి బాధితులకు:

టిట్లి బాధితులకు:

పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం లో టిట్లి తుఫానుకు అతలాకుతలమైన బదిత కుటుంబాలను పరామర్శించారు.తుఫాను వల్ల జరిగిన అపార నష్టాన్ని తమ పార్టీ అంచావేస్తోందని నివేదిక అందిన వెంటనే ప్రభుత్వం తో మాట్లాడి పూర్తి సహాయం అందేలా చెర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.మీకు సహాయం చేసేందుకు నేనెను అహర్నిశలు మీకు అందుబాటులో ఉన్న అని కూడా హామీ ఇచ్చారు.నిన్న విజయ దశమి పండుగ టిట్లి బాధితులతో కలిసి చేసుకున్నాడు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+