పెట్రోల్ వినియోగదారులకి బ్రేకింగ్ న్యూస్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులు వాడితే....
డెబిట్ మరియు క్రెడిట్ కార్డు ద్వారా పెట్రోల్ మరియు డీజీల్ కొట్టించే వినియోగదారులకి ఇక నుంచి ఏ లాభాలు ఉండవు. కస్టమర్లకు అందిస్తున్న డిస్కౌంట్లు తగ్గించాలి అని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు బావిస్తున్నాయి.
పెట్రోల్ మరియు డీజీల్
పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదుకు త్రీవ్ర కొరత వచ్చింది మనందరికీ తెలిసిందే అప్పుడు మనమందరం కార్డుల ద్వారా పెట్రోల్ మరియు డీజీల్ కొట్టించుకున్నవారికి 0.7 శాతం డిస్కౌంట్ ఇవ్వాలి అని ప్రభుత్వం కోరింది. దింతో పాటు కార్డు చెల్లింపు చార్జీలు మర్చంట్ డిస్కౌంట్ రేట్స్ భరించాలి అని సూచింది. అప్పటి నుండి ఈ భారం ఆయిల్ కంపెనీలు భరిస్తున్నాయి.
అధిక భారం
ఈ విధానాన్ని దాదాపు రెండు ఏళ్ళు నుంచి ఆయిల్ కంపెనీలు అమలుచేస్తుండడం వల్ల కంపెనీలకు అధిక భారం పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే కంపెనీలు డిస్కౌంట్లు తొలగించాలి అని భావిస్తున్నట్లు సమాచారం.
లావాదేవీలు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (HPCL) క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు ఈ వ్యలెట్ల ద్వారా పెట్రోల్ మరియు డీజీల్ కోసం చేసే లావాదేవీలు పై 0.7 శాతం సమానమైన క్యాష్ బ్యాక్ ఇస్తున్నాయి ఇది మొత్తం కొనుగోలుదారుల అకౌంట్ ల పడుతున్నాయి. అయితే ఈ డిస్కౌంట్ రానున్నరోజుల్లో ఎత్తివేస్తున్నట్లు దీనికి సంబంధించిన వర్గాలు చెబుతున్నాయి.
డిస్కౌంట్
ఇక ఆయిల్ కంపెనీలు ఈ డిస్కౌంట్ చెల్లింపుల కింద రూ.1160 కోట్లు చెల్లించాలి. రూ.220 కోట్లు బ్యాంకులకు ఇచ్చాయి. 2017- 2018 సంత్సరాలలో వీటి మొత్తం రూ.1400 కోట్లు ఉన్నట్లు కంపెనీల గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఆర్ధిక సంత్సరానికి ఈ చెల్లింపు కోసం బడ్జెట్ దాదాపు రూ.650 కోట్లు ఉన్నట్లు తెలుసుతోంది.
డిజిటల్ లావాదేవీలు
పెట్రోల్ బ్యాంకుల వద్ద డిజిటల్ లావాదేవీలు జోరుగా పెరుగుతున్నాయి.2016 లో డిజిటల్ లావాదేవీలు 10 శాతం ఉంటే ఈ సంత్సరంలో ఇప్పటివరకు 25 శాతంకి చేరాయి. డిజిటల్ పేమెంట్ల ద్వారా ఆయిల్ కంపెనీలకి కూడా లాభాలు వస్తున్నాయి. కొన్ని నెలలో ఎన్నికలు వస్తున్నాయి కనుక ఇక పెట్రోల్ మరియు డీజీల్ ధరలు పెరగబోవు అని చెబుతున్నారు.