పెట్రోల్ ధర లీటరు రూ.100 రూపాయాలకు చేరువలో ఉందా.
మంగళవారం పెట్రోల్ ధరలు ముంబయిలో రూ.90 రూపాయలకు పైగా ఉన్నాయి. దీంతో లీటరు రూ.90.22 రూపాయలకు చేరింది. డీజిల్ ధర వరుసగా రెండోరోజు సరికొత్త ధరలు నమోదుచేసింది
మంగళవారం పెట్రోల్ ధరలు ముంబయిలో రూ.90 రూపాయలకు పైగా ఉన్నాయి. దీంతో లీటరు రూ.90.22 రూపాయలకు చేరింది. డీజిల్ ధర వరుసగా రెండోరోజు సరికొత్త ధరలు నమోదుచేసింది ముంబైలో లీటరుకు రూ .78.69 చొప్పున విక్రయిస్తున్నారు. ఢిల్లీలో పెట్రోలు లీటరు రూ. 82.86, డీజిల్ ధర రూ .74.12 రూపాయలు.దీనికి ప్రధాన కారణం మహారాష్ట్రలో ఇంధన ధరలపై భారీగా వ్యాట్ చేయడమే .
ఇంధన ధరలు:
బెంగళూరులో పెట్రోలు లీటరు రూ.83.37 రూపాయలు, హైదరాబాద్ లో రూ.87.84, లక్నోలో రూ.85.25, చెన్నైలో రూ.86.13 రూపాయలు, కోల్కతాలో రూ.84.68 రూపాయల ధరలు ఉన్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) వెల్లడించింది.అలాగే డీజిల్ ధరలు బెంగుళూరు లో లీటర్ కు రూ.74.40 / లీటర్, హైదరాబాద్లో రూ .80.62 / లీటరు, చెన్నైలో రూ .78.36 / లీటరు, కోల్కతాలో రూ.75.97 రూపాయలుగా ఉన్నాయి.
పన్నులు తగ్గింపు:
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక,పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ మరియు ఇతర రాష్ట్రాలు ఇప్పటికే ఇంధన ధరలపై పన్నులు తగ్గించాయి. ఎందుకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ను అనుసరించలేరని, ప్రజలపై పడిన భారాన్ని ఛాగ్గించలేరా అని ముంబయి కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్ అన్నారు.
ధరలపై నియంత్రణ చర్యలు
నాందేడ్, అమరావతి, రత్నగిరి, ఔరంగాబాద్, జల్గావ్ వంటి రాష్ట్రంలోని పలు జిల్లాలలో పెట్రోల్ ధర 85 రూపాయల నుంచి 91 రూపాయలకు పెరిగింది.
ధరలపై నియంత్రణ చర్యలు తీసుకోనందుకు ప్రతిపక్షాలు యూనియన్ ప్రభుత్వాన్ని నిందించినప్పటికీ, ప్రపంచంలోని ముడి చమురు ధరలు, ఇతర అంతర్జాతీయ కారకాల వల్ల ఇంధన ధరల పెంపుకు కారణమవుతున్నాయి.