సోమవారం నాడు డాలర్ తో పోల్చి చూస్తే రూపాయి క్షిణించింది.
డాలర్ తో పోల్చుకుంటే రూపాయి 27 పైసలు క్షిణించి ,సోమవారం నాడు రూపాయి బలహీనపడింది.ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి 72.49 వద్ద ట్రేడ్ అవుతోంది.
డాలర్ తో పోల్చుకుంటే రూపాయి 27 పైసలు క్షిణించి ,సోమవారం నాడు రూపాయి బలహీనపడింది.ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి 72.49 వద్ద ట్రేడ్ అవుతోంది.అమెరికాతో రాబోయే వాణిజ్య చర్చల్లో చైనాకు రద్దు చేశాయి దీనివల్ల దేశీయ ఈక్విటీలలో నష్టాలు అస్థిరతకు గురయ్యాయని వారు చెప్పారు.
గత వారం డాలర్తో పోల్చుకుంటే రూపాయి వరుసగా నాలుగవ వారం నష్టాలను చవిచూసింది.
చైనాపై అమెరికా విధించిన కొత్త టారిఫ్లు సోమవారం నుంచే అమల్లోకి వస్తుండటం, అమెరికా ఫెడరల్ రిజర్వు సమావేశం వంటి అంశాల నేపథ్యంలో ట్రేడర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. భారత్లో పదేళ్ల బాండ్ ఈల్డ్ 8.031 శాతంగా ఉంది. ఇక బాండ్ ఈల్డ్ మునపటి ముగింపు స్థాయి 8.07 శాతంగా ఉంది. బాండ్ ఈల్డ్స్, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి.
ఇతర దేశాల కరెన్సీలను ఒత్తిడి చేయటం, దిగుమతులపై సుంకాలను విధించటం మొదలుపెట్టినప్పటి నుండి US డాలర్ ఏడు శాతం పెరిగింది. టర్కీ మరియు అర్జెంటీనాలో ఆర్థిక సంక్షోభం కూడా సెంటిమెంట్ను మరింత దిగజార్చింది.
ఆసియా ప్రధాన కరెన్సీలన్నీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇండోనేసియా రుపియ 0.36 శాతం, దక్షిణ కొరియా ఒన్ 0.30 శాతం, ఫిలిప్పిన్స్ పెసో 0.28 శాతం, చైనా ఆఫ్షోర్ 0.25 శాతం, సింగపూర్ డాలర్ 0.15 శాతం, చైనా రెన్మిన్బి 0.15 శాతం, తైవాన్ డాలర్ 0.1 శాతం, థాయ్ బట్ 0.08 శాతం, మలేసియా రింగిట్ 0.08 శాతం క్షీణించాయి.