జియోకి దిమ్మతిరిగే ఆఫర్ ప్రకటించిన ఎయిర్ టెల్ ఏంటో మీరే చూడండి.
దేశంలోని ఏ నెట్వర్క్కైనా అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకొనే అవకాశాన్ని కలిపిస్తోంది ఎయిర్ టెల్ రోజుకు 1.4జీబీ డేటాను, 100 ఎస్ఎంఎస్లను అందిస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ 75 రోజులు ఉంటుంది.
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ వినియోగదారుల కోసం మరో పండగ బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. జియోకి షాకిచ్చేలా ఈ ఆఫర్ ప్రవేశపెట్టింది. 419 రూపాయలతో ప్రీపెయిడ్ కస్టమర్లకు ఈ ప్లాన్ను ప్రకటించింది.
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సర్కిళ్లకు ఈ ఆఫర్ ప్రయోజనాలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ప్లాన్పై ఎలాంటి ప్రయోజనాలను ఎయిర్టెల్ అందిస్తుందంటే రూ.419తో రీఛార్జ్ చేసుకున్న వారికి దేశంలోని ఏ నెట్వర్క్కైనా అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 1.4జీబీ డేటాను, 100 ఎస్ఎంఎస్లను అందిస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ 75 రోజులు.
రీఛార్జ్ చేసుకున్న సమయం నుంచి వాయిస్ కాల్స్పై ఎలాంటి ఎఫ్యూపీ పరిమితి ఉండదు. ఒకవేళ 4జీ కవరేజ్ ఏరియా బయట ఈ ప్లాన్ను వాడుకోవాలంటే, 3జీ, 2జీ నెట్వర్క్లపై అదే డేటా వాడుకోవచ్చు. ఎయిర్టెల్ ఇటీవలే రూ.97 ప్లాన్ను తీసుకొచ్చింది. రూ.35తో ప్రారంభమయ్యే కోంబో ప్లాన్లకు ఈ ప్లాన్ను జత చేర్చింది. రూ.97పై 1.5 జీబీ 3జీ లేదా 4జీ డేటా, 350 నిమిషాల లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ అందిస్తోంది. దీనిలోనే 200 లోకల్, ఎస్టీడీ ఎస్ఎంఎస్ ప్రయోజనాలు యూజర్లకు దక్కుతున్నాయి. ఈ ప్లాన్ వాలిడిటీ నెల రోజులు మాత్రమే. ఎయిర్టెల్ వెబ్సైట్, మైఎయిర్టెల్ యాప్ ద్వారా ఈ ప్యాక్ను కస్టమర్లకు పొందవచ్చు.