సామాన్యుడికి సినిమా చూపిస్తున్న పెట్రోల్ మరియు డీజిల్ ధరలు వివిధ పట్టణాలలో ఇలా ఉన్నాయి.
శనివారం కూడా పెట్రోల్ మరియు డీజీల్ ధరలు మరింత పెరిగి రికార్డు స్థాయికి చేరాయి. దేశ రాజధానిలో నేడు పెట్రోల్ ధర 35పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 81.63కు చేరింది. ఇక డీజిల్ ధర కూడా 24పైసలు పెరిగి లీటర్ ధర రూ. 73.54గా ఉంది.
పెట్రోల్
పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మరోసారి పెరిగిపోయాయి. రోజు రోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్ ధరలను చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయినప్పటికీ ధరలు రోజు రోజుకీ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. శనివారం కూడా పెట్రోల్ మరియు డీజీల్ ధరలు మరింత పెరిగి రికార్డు స్థాయికి చేరాయి. దేశ రాజధానిలో నేడు పెట్రోల్ ధర 35పైసలు పెరిగింది. దీంతో దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 81.63కు చేరింది. ఇక డీజిల్ ధర కూడా 24పైసలు పెరిగి లీటర్ ధర రూ. 73.54గా ఉంది.
శనివారం
ఇంధన ధరలు అత్యధికంగా ఉండే ముంబయిలో పెట్రోల్ ధర రూ. 90కి మరింత చేరువైంది. శనివారం అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 89.01గా ఉంది. ఇక లీటర్ డీజిల్ ధర రూ. 78.07కు చేరింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 86.18, డీజిల్ ధర రూ. 79.73గా ఉండగా విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 85.41, డీజిల్ ధర రూ. 78.63కు చేరింది.
దేశీయంగా
సెప్టెంబరు 5, సెప్టెంబరు 12 మినహా గత కొన్ని వారాలుగా ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ముడిచమురు ధరలు పెరగడంతో పాటు ఎక్సైజ్ సుంకం ఎక్కువగా ఉండటంతో దేశీయంగా చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆగస్టు మధ్య నుంచి ఇప్పటి వరకు లీటర్ పెట్రోల్పై రూ. 4.83, డీజిల్పై రూ.5 పెరిగింది.
ధరలు
హైదరాబాద్: లీటర్ పెట్రోల్ రూ. 86.59, డీజిల్ రూ.80.82
విజయవాడ: లీటర్ పెట్రోల్ రూ. 85.41, డీజిల్ రూ.78.63
ఢిల్లీ: లీటర్ పెట్రోల్ రూ. 81.63, డీజిల్ రూ.73.54
ముంబై: లీటర్ పెట్రోల్ రూ. 89.01, డీజిల్ రూ. 78.07
కోల్కతా: లీటర్ పెట్రోల్ రూ. 83.49, డీజిల్ రూ. 75.39
చెన్నై: లీటర్ పెట్రోల్ రూ. 84.50, డీజిల్ రూ. 77.74