రూ.50 రూపాయికే లీటర్ డీజిల్ రూ.55 రూపాయికే లీటర్ పెట్రోల్ ఎక్కడో తెలుసా?
కేంద్ర పెట్రోలియం మంత్రిశాఖ చత్తిస్గఢ్ రాష్ట్రానికి ఐదు ఇథనాల్ ప్లాంట్లకు అనుమతులు మంజూరు చేసింది అని ఈ ప్లాంట్లలో వరి గడ్డి, గోధుమ గడ్డి, చెరుకు మరియు మునిసిపల్ వ్యర్ధాల ద్వారా ఇంధనం ఉత్పత్తి అవుతుంది అని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గట్కారీ వెల్లడించారు.
రూ.55 రూపాయిలకే
ఇలా ఇంధనం ఉత్పత్తి పెంచడం ద్వారా రూ.50 రూపాయిలకే లీటర్ డీజిల్ మరియు రూ.55 రూపాయిలకే లీటర్ పెట్రోల్ అందించవచ్చు అని ఆయన తెలిపారు. ఈమేరకు
అయన చత్తిస్గడ్ లోని దుర్గ్ జిల్లాలో నిర్వహించిన ఒక సభలో అయన చెప్పారు.
లక్షల కోట్ల రూపాయల
ఇలా ఇంధనం ఉత్పత్తి వల్ల పెట్రోల్ మరియు డీజిల్ మీద ఆధారపడడం తగులుతుంది అని అయన చెప్పారు. మనం 8 లక్షల కోట్ల రూపాయల పెట్రోల్ మరియు డీజిల్ ను దిగుమతి చేసికుంటున్నాము వీటి ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి.
డాలర్
డాలర్ తో పోల్చుకుంటే రూపాయి పడిపోతోంది ఇక ఇథనాల్ , మిథనాల్ , బయో ఫ్యూయల్, సి ఎన్ జి (CNG )వాడకం ద్వారా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు భారీగా తగ్గిపోతాయి అని అయన సభలో వెల్లడించారు.
బయో టెక్నాలజీ
చత్తిస్గడ్ రాష్ట్రము బయో ఫ్యూయల్ హబ్ గా అభివృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రాష్ట్రము దేశంలోనే బయో ఫ్యూయల్ పరిశ్రమలో అగ్రగ్రామిగా నిలిచేందుకు బయో టెక్నాలజీ పరిశోధన సంస్థను రాయపూర్లో నిర్వహిస్తాం అని నితిన్ పేర్కొన్నారు.