గోఎయిర్ న్యూ సేల్ ఆఫర్.అతి తక్కువ ధరకే టిక్కెట్లు.
న్యూఢిల్లీ: బడ్జెట్ క్యారియర్ గోఎయిర్ న్యూ సేల్ ఆఫర్ కింద రూ.1,099 రూపాయల నుంచి విమాన టిక్కెట్లను ఆఫర్ చేస్తోంది.
న్యూఢిల్లీ: బడ్జెట్ క్యారియర్ గోఎయిర్ న్యూ సేల్ ఆఫర్ కింద రూ.1,099 రూపాయల నుంచి విమాన టిక్కెట్లను ఆఫర్ చేస్తోంది.
గోఎయిర్
గోఎయిర్ యొక్క తాజా డిస్కౌంట్ ఆఫర్ ప్రకారం, ప్రయాణీకులు 2018 సెప్టెంబర్ 10 నుంచి 12 సెప్టెంబర్ మధ్యకాలంలో టిక్కెట్లను బుక్ చేసుకోవాలి అలాగే ప్రయాణం 10 సెప్టెంబర్ నుండి 30 సెప్టెంబర్ మధ్యకాలంలో కొనసాగించవచ్చు. ఈ తగ్గింపు ఆఫర్ కింద సీట్ల సంఖ్య గోఎయిర్ వెల్లడించలేదు.
గోఎయిర్ వెబ్సైట్ ప్రకారం, బాగ్డోగ్ర-గువహతి మార్గంలో ప్రయాణానికి రూ.1,099 రూపాయల నగదు ధర వర్తిస్తుంది.
టిక్కెట్ల ధర:
అహ్మదాబాద్-ఢిల్లీ (రూ .1,399), బాగ్డోగ్ర-కోల్కతా (రూ .1,399), బాగ్డోగ్ర-గువహతి (రూ 1,099), బెంగళూరు-గోవా (రూ .1499), బెంగళూరు-హైదరాబాద్ (1,399 రూపాయలు), ఢిల్లీ-అహ్మదాబాద్ (రూ .1,399), ఢిల్లీ-జమ్ము (Rs 1,699), ఢిల్లీ-లెహ్ (Rs 1,999) మరియు ఢిల్లీ-లక్నో (రూ .1,299) ధరలు ఉన్నటు ప్రకటించింది.
జమ్మూ-ఢిల్లీ (రూ .1,399), జమ్మూ-శ్రీనగర్ (రూ .1,399), కోల్కతా-భువనేశ్వర్ (రూ .1,399), లెహ్-శ్రీనగర్ (రూ. 1,399), లక్నో- ఢిల్లీ (రూ .1,399), ముంబై- అహ్మదాబాద్ (రూ .1,299), పాట్నా-కోల్కతా (రూ .1,299), పుణె-అహ్మదాబాద్ (రూ. 1,499), పుణె-బెంగళూరు (రూ. 1,599) అలాగే మరికొన్ని మార్గాల్లో గోఎయిర్ ఆఫర్ క్రింద ధరలు వర్తిస్తాయని సంస్థ ప్రకటించండి.
ఎయిర్ఏషియా
మరో బడ్జెట్ క్యారియర్ ఎయిర్ఏషియా కూడా తన డిస్కౌంట్ ఆఫర్ను విస్తరించింది. ఎయిర్ఏషియా ప్రస్తుతం రూ 999 ధరతో సెప్టెంబర్ 11 వరకు టిక్కెట్లను అందుబాటులో ఉంచింది.అలాగే ఈ ప్రయాణం 19 ఫిబ్రవరి నుండి 26 నవంబర్ 2019 వరకు కొనసాగించవచ్చు. ఎయిర్ఏషియా ఆఫర్ ప్రకారం బెంగళూరు-చెన్నై (రూ. 999), హైదరాబాద్-బెంగళూరు (రూ. 1,999), భువనేశ్వర్-కోల్కతా (రూ. 1,199), రాంచీ-కోల్కతా (రూ. 1,999) ధరలు ఉన్నాయని క్యారియర్ వెబ్సైటు లో వెల్లడించింది.
ఇండిగో మరియు జెట్ ఎయిర్వేస్
ఇండిగో మరియు జెట్ ఎయిర్వేస్లు కూడా త్వరలో రాబోయే సీజన్లలో ప్రయాణీకులను ఆకర్షించడానికి తగ్గింపు పథకాలను ప్రారంభించనున్నారు.చమురు ధరలు మరియు అలాగే రూపాయి పఠనం వంటి కారణాల వల్ల అధిక ఖర్చులు ఉన్నప్పటికి ఎయిర్లైన్స్ డిస్కౌంట్ పథకాలు ప్రారంభించింది ప్రయాణికులు అధిక చార్జీలు చెల్లించలేని సందర్భాల్లో కొన్ని సార్లు లాభాలు మరియు నష్టాల్లో కూడా కొనసాగుతుంది.
డిసెంబరు చివరి నాటికి
వాడియా గ్రూప్ నియంత్రిత గోఎయిర్ డిసెంబరు చివరి నాటికి 13 అదనపు ఎయిర్బస్ A320neo జెట్ లైన్లను డెలివరీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది, ఇది దేశీయ సేవలను విస్తరించడానికి మరియు థాయిలాండ్తో ప్రారంభించి అంతర్జాతీయ విమానాలను ప్రారంభించనుంది.