పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలపై జాతీయస్థాయిలో భారత్ బంద్ నిరసనకు మధ్య సోమవారం జరిగింది. కానీ బంద్ జరిగిన కూడా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు సోమవారం రికార్డు స్థాయికి చేరాయి ప్రధమంగా నాలుగు పట్టణాలలో ముందుగా ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.88 రూపాయిలు ఉంది. పెట్రోల్ రిటైలర్ల నోటిఫికేషన్ ప్రకారం ఢిల్లీలో లీటరుకు రూ. 80.73 రూపాయలు, ముంబయిలో లీటరుకు 88.12 రూపాయలు చెన్నైలో లీటరుకు రూ. 83.91 రూపాయలు, కోల్కతాలో లీటరుకు
రూ. 83.61 రూపాయలు. డీజిల్ ధర ఢిల్లీలో లీటరుకు రూ. 72.83 రూపాయలు, రూ. ముంబయిలో లీటరుకు రూ. 77.32 రూపాయలు, చెన్నైలో లీటరుకు రూ. 76.98 రూపాయలు, కోల్కతాలో లీటరుకు రూ. 75.68 చేరుకుంది.

చంద్రబాబు నాయుడు
కానీ ఇంతలో ఆంధ్రప్రదేశ్ వాహనదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక శుభవార్త చెప్పారు. విపరీతంగా పెరిగిపోతున్న పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ప్రజల పై భారం పడకుండా ఉండాలి అని పెట్రోల్ మరియు డీజిల్ మీద పన్ను తగ్గించాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు అని సమాచారం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పెట్రోల్,మరియు డీజిల్ ధరల పెంపుపై లీటరుకు రూ. 2 చొప్పున తగ్గిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం ఉదయం నుంచి పెట్రోలు ధర లీటర్ రూ. 84.71 రూపాయలు, డీజిల్ రూ. ధర 77.98 రూపాయలకు చేరుకుంది.దింతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా మీద భారం పడే అవకాశం ఉంది.

కాంగ్రెస్ పార్టీ
ఇక గత పది రోజుల నుండి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న కారణంగా కాంగ్రెస్ పార్టీ వారు సోమవారం భారత్ బంద్ కి పిలుపించింది. ఇది అందరికి తెలిసిన విషయమే కానీ ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పెట్రోల్ మరియు డీజిల్ పై పన్ను తగ్గించాలి అని నిర్ణయం తీసుకోవడం విశేషం.

రెండో ముఖ్యమంత్రిగా
పెట్రోల్ మరియు డీజిల్ ధరల రూ.2 రూపాయిల పై పన్ను కట్ చేయడంలో చంద్రబాబు నాయుడు రెండో ముఖ్యమంత్రిగా నిలిచారు. ఇలా తగ్గించిన రేట్లు ఆంధ్రరాదేశ్ రాష్ట్రంలో రేపటి నుంచి ధరలు అమలు లోకి వస్తాయి.

అసెంబ్లీలో
ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో ధర తగ్గింపును ప్రకటించిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సామాన్య ప్రజలు పెరుగుతున్న ధరల ప్రభావంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు అని కనుక ధరలను తగ్గించేందుకు కేంద్రం ముందుకు రావాలి అని అయన అన్నారు.

రూపాయి
ఇరాక్ మరియు అమెరికా ఆంక్షలు, డాలర్ పై రూపాయి పతనానికి గురవడంతో చమురు ధరలు పెరిగాయి. నిన్న, రాజస్థాన్ వసుంధరా రాజే పెట్రోల్ మరియు డీజిల్ మీద ఇదే విధమైన కట్ ప్రకటించారు.

కేంద్రం
దేశంలో చమురు ధరలు మరియు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరతో ముడిపడివున్నాయి. కానీ దాని మీద, కేంద్రం మరియు రాష్ట్రాలు రెండూ పన్నులు విధించడం చాలా బాధాకరం. ఎక్సైజ్ సుంకం తగ్గినట్లయితే రిటైల్ ధరల తగ్గింపు మాత్రమే జరుగుతుంది ఈ సందర్భంలో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నష్టాన్నిభరించాలి లేదా చమురు సంస్థలు నేరుగా దానిని భరించాలి.

మొదటి స్థానంలో
ఇక భారతదేశంలో పెట్రోల్ పై విలువ ఆధారిత పన్నుఆంధ్రప్రదేశ్ అత్యధికంగా 35.77 శాతంలో మొదటి స్థానంలో ఉంది తర్వాత మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ డీజెల్ కోసం 28.08 శాతం చొప్పున విలువ ఆధారిత పన్ను ఉంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications